Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా నివాళులు.. నూతన కమిటీ సభ్యులకు సన్మానం విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 16, 2026 11:04 PM

ఉత్తమ జాతీయ గ్రంథపాలకుడిగా డా. రవికుమార్ చేగొని

ఉత్తమ జాతీయ గ్రంథపాలకుడిగా డా. రవికుమార్ చేగొని

ఉత్తమ జాతీయ గ్రంథపాలకుడిగా డా. రవికుమార్ చేగొని
16-08-2026 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: భారత గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డా. ఎస్‌.ఆర్‌. రంగనాథన్‌ 134వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రంథపాలకుడిగా సేవలందిస్తున్న డా. రవికుమార్ చేగొని జాతీయ ఉత్తమ గ్రంథపాలకుడిగా పురస్కారం అందుకున్నారు.

మద్రాస్ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తమిళనాడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆనంద్, ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి దొరస్వామి, మద్రాస్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆర్మ్‌స్ట్రాంగ్, కొడైకెనాల్ మదర్‌ థెరిసా విశ్వవిద్యాలయం ప్రతినిధి జానకి, మద్రాస్ గ్రంథాలయ సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యుల చేతుల మీదుగా డా. రవికుమార్ చేగొని ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

గ్రంథాలయ రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలు, విద్యార్థులకు సమాచారాన్ని చేరువ చేయడంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ జాతీయ స్థాయి పురస్కారం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డా. రవికుమార్ చేగొనికి కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, గ్రంథాలయ రంగ ప్రముఖులు, మిత్రులు అభినందనలు తెలిపారు.

Sthanikam

ఉత్తమ జాతీయ గ్రంథపాలకుడిగా డా. రవికుమార్ చేగొని

Article Image

హైదరాబాద్: భారత గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డా. ఎస్‌.ఆర్‌. రంగనాథన్‌ 134వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రంథపాలకుడిగా సేవలందిస్తున్న డా. రవికుమార్ చేగొని జాతీయ ఉత్తమ గ్రంథపాలకుడిగా పురస్కారం అందుకున్నారు.

మద్రాస్ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తమిళనాడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆనంద్, ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి దొరస్వామి, మద్రాస్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆర్మ్‌స్ట్రాంగ్, కొడైకెనాల్ మదర్‌ థెరిసా విశ్వవిద్యాలయం ప్రతినిధి జానకి, మద్రాస్ గ్రంథాలయ సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యుల చేతుల మీదుగా డా. రవికుమార్ చేగొని ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

గ్రంథాలయ రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలు, విద్యార్థులకు సమాచారాన్ని చేరువ చేయడంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ జాతీయ స్థాయి పురస్కారం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డా. రవికుమార్ చేగొనికి కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, గ్రంథాలయ రంగ ప్రముఖులు, మిత్రులు అభినందనలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News