హైదరాబాద్: భారత గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డా. ఎస్.ఆర్. రంగనాథన్ 134వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రంథపాలకుడిగా సేవలందిస్తున్న డా. రవికుమార్ చేగొని జాతీయ ఉత్తమ గ్రంథపాలకుడిగా పురస్కారం అందుకున్నారు.
మద్రాస్ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తమిళనాడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆనంద్, ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి దొరస్వామి, మద్రాస్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆర్మ్స్ట్రాంగ్, కొడైకెనాల్ మదర్ థెరిసా విశ్వవిద్యాలయం ప్రతినిధి జానకి, మద్రాస్ గ్రంథాలయ సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యుల చేతుల మీదుగా డా. రవికుమార్ చేగొని ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
గ్రంథాలయ రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలు, విద్యార్థులకు సమాచారాన్ని చేరువ చేయడంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ జాతీయ స్థాయి పురస్కారం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డా. రవికుమార్ చేగొనికి కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, గ్రంథాలయ రంగ ప్రముఖులు, మిత్రులు అభినందనలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి