Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా నివాళులు.. నూతన కమిటీ సభ్యులకు సన్మానం విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 16, 2026 10:04 PM

దోసపల్లిలో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకలు

దోసపల్లిలో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకలు

దోసపల్లిలో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకలు
16-08-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల పరిధిలోని దోసపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారురాలు శ్రీమతి అపరంజి, భర్త సుధాకర్ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన గృహాన్ని ప్రారంభించి, అపరంజి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత గూడు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తోందని అన్నారు. పేదల సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు. సొంతింటి కల నెరవేరడం ప్రతి కుటుంబానికి ఎంతో ఆనందాన్ని కలిగించే విషయమని, అపరంజి కుటుంబం నూతన గృహంలో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దోసపల్లి గ్రామ సర్పంచ్ బిరాదర్ దత్తు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, లబ్ధిదారురాలి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దోసపల్లిలో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకలు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల పరిధిలోని దోసపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారురాలు శ్రీమతి అపరంజి, భర్త సుధాకర్ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన గృహాన్ని ప్రారంభించి, అపరంజి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత గూడు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తోందని అన్నారు. పేదల సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు. సొంతింటి కల నెరవేరడం ప్రతి కుటుంబానికి ఎంతో ఆనందాన్ని కలిగించే విషయమని, అపరంజి కుటుంబం నూతన గృహంలో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దోసపల్లి గ్రామ సర్పంచ్ బిరాదర్ దత్తు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, లబ్ధిదారురాలి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News