Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుర్రం శ్రీధర్ స్మారకార్థం ఉచిత మెగా వైద్య శిబిరం విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 16, 2026 09:09 PM

రత్తమ్మ కుటుంబానికి న్యాయం చేయాలి......

రత్తమ్మ కుటుంబానికి న్యాయం చేయాలి......

రత్తమ్మ కుటుంబానికి న్యాయం చేయాలి......
16-08-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

మున్సిపాలిటీలో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికురాలు పులి రత్తమ్మ, ఆమె కూతురు జ్యోతిల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మున్సిపల్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని రత్తమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం బాధాకరమన్నారు. శనివారం కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రత్తమ్మను ఆయన పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ సంవత్సరాల తరబడి విధుల్లో ఉన్న కార్మికుల సర్వీస్ రికార్డులను పక్కనబెట్టి, జీతాలు ఇవ్వకుండా వేధింపులకు గురిచేయడం వల్లే ప్రాణాలకు తెగించే పరిస్థితి వచ్చిందన్నారు. 14 ఏళ్లుగా సేవలు అందిస్తున్న కూతురు జ్యోతికి కూడా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న మున్సిపల్ యంత్రంగం, నిరుపేద కార్మికుల పొట్టకొట్టడం తగదన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ ఈ విషయంలో జోక్యం చేసుకుని, రత్తమ్మ కుటుంబానికి ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్, కౌన్సిలర్ చీమ నరేష్ బాబు, గట్ల కోటేశ్వరరావు,సంపేట ఉపేందర్, బత్తుల ఉపేందర్, సోమపొంగు రాజు, మాదాల ఉపేందర్,చీమ శ్రీను, చలిగంటి లక్ష్మణ్, నేలవెల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు......

Sthanikam

రత్తమ్మ కుటుంబానికి న్యాయం చేయాలి......

Article Image

మున్సిపాలిటీలో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికురాలు పులి రత్తమ్మ, ఆమె కూతురు జ్యోతిల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మున్సిపల్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని రత్తమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం బాధాకరమన్నారు. శనివారం కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రత్తమ్మను ఆయన పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ సంవత్సరాల తరబడి విధుల్లో ఉన్న కార్మికుల సర్వీస్ రికార్డులను పక్కనబెట్టి, జీతాలు ఇవ్వకుండా వేధింపులకు గురిచేయడం వల్లే ప్రాణాలకు తెగించే పరిస్థితి వచ్చిందన్నారు. 14 ఏళ్లుగా సేవలు అందిస్తున్న కూతురు జ్యోతికి కూడా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న మున్సిపల్ యంత్రంగం, నిరుపేద కార్మికుల పొట్టకొట్టడం తగదన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ ఈ విషయంలో జోక్యం చేసుకుని, రత్తమ్మ కుటుంబానికి ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్, కౌన్సిలర్ చీమ నరేష్ బాబు, గట్ల కోటేశ్వరరావు,సంపేట ఉపేందర్, బత్తుల ఉపేందర్, సోమపొంగు రాజు, మాదాల ఉపేందర్,చీమ శ్రీను, చలిగంటి లక్ష్మణ్, నేలవెల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు......

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News