Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ట్యాంకర్ల నుంచి రసాయనాల దారి మళ్లింపు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 16, 2026 07:01 PM

అంబేద్కర్ అభయహస్తం హామీలను అమలు చేయాలి....

అంబేద్కర్ అభయహస్తం హామీలను అమలు చేయాలి....

అంబేద్కర్ అభయహస్తం హామీలను అమలు చేయాలి....
16-08-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

అంబేద్కర్ అభయహస్తం హామీలను అమలు చేయాలి....


ఈ నెల 25న చలో కోదాడ బహిరంగ సభను విజయవంతం చేయాలి.......


హామీలు నెరవేర్చే వరకు పోరాటం.....


ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతాబాబు పిలుపు.......


ప్రభుత్వం ఎన్నికల్లో దళితులకు ప్రకటించిన అంబేద్కర్ అభయహస్తం హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న కోదాడ వర్తక సంఘం ప్రాంగణంలో చలో కోదాడ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతాబాబు మాదిగ తెలిపారు. ఎమ్మార్పీఎస్ కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు బచ్చలకూరి నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని హుజూర్‌నగర్ రోడ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడి సాధించుకున్నప్పటికీ, దళితుల సంక్షేమానికి ఇచ్చిన హామీలు నెరవేరడం లేదన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం దళిత కుటుంబాలకు ‘అంబేద్కర్ అభయహస్తం’ కింద రూ.12 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, అసైన్డ్ భూములపై అమ్ముకునే హక్కు కల్పిస్తూ వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే భూమి లేని దళితులకు భూమి, ఫీజు రీయింబర్స్‌మెంట్, విదేశీ విద్యకు సహాయం, ప్రతి మండలంలో గురుకులాల ఏర్పాటును పూర్తి చేయాలన్నారు. హామీలను నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బల్గూరి హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి బాణాల అబ్రహం, జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి బొల్లెపోగు స్వామి, కోదాడ మండల అధ్యక్షులు నారకట్ల ప్రసాద్,యమ్. యస్. యఫ్ నాయకులు పిడమర్తి బాబురావు,ఎమ్మార్పీఎస్ టౌన్ అధ్యక్షులు ఏర్పుల చిన్ని, బేడా బుడగ జంగాల అధ్యక్షులు ముత్తయ్య, రాజేష్,వంశీ,ప్రతాప్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.......


Sthanikam

అంబేద్కర్ అభయహస్తం హామీలను అమలు చేయాలి....

Article Image

అంబేద్కర్ అభయహస్తం హామీలను అమలు చేయాలి....


ఈ నెల 25న చలో కోదాడ బహిరంగ సభను విజయవంతం చేయాలి.......


హామీలు నెరవేర్చే వరకు పోరాటం.....


ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతాబాబు పిలుపు.......


ప్రభుత్వం ఎన్నికల్లో దళితులకు ప్రకటించిన అంబేద్కర్ అభయహస్తం హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న కోదాడ వర్తక సంఘం ప్రాంగణంలో చలో కోదాడ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతాబాబు మాదిగ తెలిపారు. ఎమ్మార్పీఎస్ కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు బచ్చలకూరి నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని హుజూర్‌నగర్ రోడ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడి సాధించుకున్నప్పటికీ, దళితుల సంక్షేమానికి ఇచ్చిన హామీలు నెరవేరడం లేదన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం దళిత కుటుంబాలకు ‘అంబేద్కర్ అభయహస్తం’ కింద రూ.12 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, అసైన్డ్ భూములపై అమ్ముకునే హక్కు కల్పిస్తూ వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే భూమి లేని దళితులకు భూమి, ఫీజు రీయింబర్స్‌మెంట్, విదేశీ విద్యకు సహాయం, ప్రతి మండలంలో గురుకులాల ఏర్పాటును పూర్తి చేయాలన్నారు. హామీలను నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బల్గూరి హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి బాణాల అబ్రహం, జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి బొల్లెపోగు స్వామి, కోదాడ మండల అధ్యక్షులు నారకట్ల ప్రసాద్,యమ్. యస్. యఫ్ నాయకులు పిడమర్తి బాబురావు,ఎమ్మార్పీఎస్ టౌన్ అధ్యక్షులు ఏర్పుల చిన్ని, బేడా బుడగ జంగాల అధ్యక్షులు ముత్తయ్య, రాజేష్,వంశీ,ప్రతాప్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.......


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News