ఏకగ్రీవంగా నూతన కమిటీ ఎన్నిక
ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ టౌన్ నూతన అధ్యక్షునిగా ఊదరి రాకేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ ఆధ్వర్యంలో గ్రామ కమిటీల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ఇందులో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు లింగరెడ్డిగూడెంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాట్లాడుతూ... వర్గీకరణ సాధనే లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ గత 30 సంవత్సరాలుగా నిరంతరం పోరాడి, చివరకు అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడిందని గుర్తుచేశారు. సంఘ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.సమావేశంలో చౌటుప్పల్ టౌన్ అధ్యక్షునిగా ఊదరి రాకేష్,ఉపాధ్యక్షుడు ఆరుట్ల చందు, ప్రధాన కార్యదర్శి ఊదరి రాకేష్, కార్యదర్శి పుర్రు వంశీ,సాంస్కృతిక కార్యదర్శి బోదుల సాయి కుమార్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ జర్నలిస్టుల ఫోరం మండల అధ్యక్షుడు ఆరుట్ల లింగస్వామి, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బోదుల లింగస్వామి, బోదుల స్వామి, బోదుల గణేష్, ఆరుట్ల చందు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి