హయత్నగర్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హయత్నగర్లో గ్రంథపాలకుడిగా సేవలందిస్తున్న డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్కు జాతీయస్థాయి ఉత్తమ గ్రంథపాలక అవార్డు–2026 లభించింది. చెన్నైలో మద్రాస్ లైబ్రరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు.
తిరు రాజా మోహన్, విద్యాశాఖ మంత్రి, పద్మశ్రీ అవార్డు గ్రహీత కళ్యాణ సుందరం, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ వైస్చాన్సలర్ ప్రొఫెసర్ ఆర్మ్స్ట్రాంగ్, ద్రవిడ యూనివర్సిటీ వైస్చాన్సలర్ ప్రొఫెసర్ దొరస్వామి తదితర ప్రముఖుల చేతుల మీదుగా డాక్టర్ దుర్గాప్రసాద్ అవార్డును స్వీకరించారు.
విద్యార్థులకు గ్రంథాలయ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు డిజిటల్ వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడం, విద్యా–ఉద్యోగ సమాచారాన్ని అందించడంలో ఆయన విశేష కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ‘ఈ-లైబ్రరీ తెలంగాణ’ బ్లాగ్ ద్వారా విద్యార్థులు, ఉద్యోగార్థులు, పరిశోధకులకు విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షలు, పరిశోధన తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ దుర్గాప్రసాద్

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి