Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కంది పంటలో అధిక దిగుబడికి సులభమైన యాజమాన్య పద్ధతి విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 17, 2026 06:27 PM

కంది పంటలో అధిక దిగుబడికి సులభమైన యాజమాన్య పద్ధతి

కంది పంటలో అధిక దిగుబడికి సులభమైన యాజమాన్య పద్ధతి

కంది పంటలో అధిక దిగుబడికి సులభమైన యాజమాన్య పద్ధతి
17-08-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలం సుక్కల్తీర్థం గ్రామ శివారులో కంది పంట సాగు చేస్తున్న రైతులకు వ్యవసాయ విస్తీర్ణధికారి సంతోష్ అధిక దిగుబడి సాధించే పద్ధతులపై అవగాహన కల్పించారు. కంది మొక్కల్లో సరైన సమయంలో ‘కొనల కత్తిరింపు’ (చిగుళ్లు గిల్లడం) చేయడం వల్ల మొక్క పైకి ఎక్కువగా పెరగకుండా పక్క కొమ్మలు విస్తరించి గుబురుగా పెరుగుతాయని తెలిపారు. దీంతో పూత, కాయల సంఖ్య పెరిగి దిగుబడి మెరుగుపడే అవకాశం ఉంటుందని వివరించారు. విత్తిన 30–45 రోజుల మధ్య మొక్క శాఖీయ ఎదుగుదల దశలో ఉన్నప్పుడు పైభాగంలోని చిగుళ్లను గిల్లాలని, అవసరాన్ని బట్టి 60–70 రోజుల మధ్య మరోసారి పక్క కొమ్మల కొనలను గిల్లవచ్చని సూచించారు. అయితే పూత దశ ప్రారంభమైన తర్వాత కొనలను కత్తిరించకూడదని, శాఖీయ ఎదుగుదల దశలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రైతులకు సూచించారు. చిన్నపాటి యాజమాన్య పద్ధతిగా కొనల కత్తిరింపును పాటించడం ద్వారా కంది పంటలో మంచి దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుందని సంతోష్ తెలిపారు.

Sthanikam

కంది పంటలో అధిక దిగుబడికి సులభమైన యాజమాన్య పద్ధతి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలం సుక్కల్తీర్థం గ్రామ శివారులో కంది పంట సాగు చేస్తున్న రైతులకు వ్యవసాయ విస్తీర్ణధికారి సంతోష్ అధిక దిగుబడి సాధించే పద్ధతులపై అవగాహన కల్పించారు. కంది మొక్కల్లో సరైన సమయంలో ‘కొనల కత్తిరింపు’ (చిగుళ్లు గిల్లడం) చేయడం వల్ల మొక్క పైకి ఎక్కువగా పెరగకుండా పక్క కొమ్మలు విస్తరించి గుబురుగా పెరుగుతాయని తెలిపారు. దీంతో పూత, కాయల సంఖ్య పెరిగి దిగుబడి మెరుగుపడే అవకాశం ఉంటుందని వివరించారు. విత్తిన 30–45 రోజుల మధ్య మొక్క శాఖీయ ఎదుగుదల దశలో ఉన్నప్పుడు పైభాగంలోని చిగుళ్లను గిల్లాలని, అవసరాన్ని బట్టి 60–70 రోజుల మధ్య మరోసారి పక్క కొమ్మల కొనలను గిల్లవచ్చని సూచించారు. అయితే పూత దశ ప్రారంభమైన తర్వాత కొనలను కత్తిరించకూడదని, శాఖీయ ఎదుగుదల దశలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రైతులకు సూచించారు. చిన్నపాటి యాజమాన్య పద్ధతిగా కొనల కత్తిరింపును పాటించడం ద్వారా కంది పంటలో మంచి దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుందని సంతోష్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News