తెలంగాణ రాష్ట్ర సర్పంచుల జేఏసీలో ఇంద్రపాలనగర్ సర్పంచ్ గర్దాస్ విక్రమ్కు కీలక బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన రాష్ట్ర సర్పంచుల జేఏసీ సమావేశంలో ఆయనను రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం మాజీ మంత్రి, రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ గౌరవాధ్యక్షుడు వి. శ్రీనివాస్ గౌడ్, జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యలు విక్రమ్కు నియామక పత్రాన్ని అందజేశారు.
సర్పంచుల సమస్యల పరిష్కారమే లక్ష్యం.
రాష్ట్రంలోని సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, గ్రామీణాభివృద్ధికి జేఏసీ తరఫున తమ వంతు కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు. విక్రమ్కు రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించడంపై పలువురు సర్పంచులు, జేఏసీ నాయకులు అభినందనలు తెలిపారు.
సమావేశంలో వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, సర్పంచులు, జేఏసీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి