సత్కరించిన మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి
ప్రజాసేవలో విశేష ప్రతిభ కనబరిచి యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి ఉత్తమ తహసీల్దార్ అవార్డు పొందిన చౌటుప్పల్ తహసీల్దార్ వీరబాయిని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. మండల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వివిధ విభాగాలలో సమర్థవంతమైన సేవలు అందించడం వల్లే ఆమెకు ఈ గుర్తింపు లభించిందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు బాణాల రాంరెడ్డి, గుత్తా వెంకట్ రెడ్డి, బత్తుల శ్రీహరి, తూర్పుంటి రవి, లచ్చునాయక్, తిగుళ్ల బాలరాజు, జీపీవోలు, ఇతర రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి