Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు దివీస్ ల్యాబొరేటరీస్ సీఎస్ఆర్ నిధులతో నేలపట్ల సమగ్రాభివృద్ధి: యాజమాన్యం హామీ విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 17, 2026 09:18 PM

పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు

పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు

పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు
17-08-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగోల్, ఆగస్టు 17: పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధిస్తూ ఎల్‌బీనగర్‌లోని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. నాగోల్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రైం నంబర్ 405/2025లో బీఎన్‌ఎస్ సెక్షన్ 78, పోక్సో చట్టంలోని సెక్షన్ 11 రెడ్ విత్ 12 కింద కేసు నమోదైంది.

ఈ కేసులో నిందితుడు ఉప్పు రాకేష్ (24)ను కోర్టు దోషిగా నిర్ధారించింది. అతనికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3,000 జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి రూ.50,000 పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది.

కేసు దర్యాప్తును నాగోల్ ఎస్‌ఐ పి. శివ నాగ ప్రసాద్ చేపట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పీపీలు శోభారాణి, పి. సత్యనారాయణ వాదనలు వినిపించారు. కేసు విచారణలో నాగోల్ పోలీస్‌స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ రాజు, సమన్స్ కానిస్టేబుల్ వెంకటేష్, ఏఎస్సై పి. శోభ సహకరించారు.

Sthanikam

పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు

Article Image

నాగోల్, ఆగస్టు 17: పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధిస్తూ ఎల్‌బీనగర్‌లోని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. నాగోల్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రైం నంబర్ 405/2025లో బీఎన్‌ఎస్ సెక్షన్ 78, పోక్సో చట్టంలోని సెక్షన్ 11 రెడ్ విత్ 12 కింద కేసు నమోదైంది.

ఈ కేసులో నిందితుడు ఉప్పు రాకేష్ (24)ను కోర్టు దోషిగా నిర్ధారించింది. అతనికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3,000 జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి రూ.50,000 పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది.

కేసు దర్యాప్తును నాగోల్ ఎస్‌ఐ పి. శివ నాగ ప్రసాద్ చేపట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పీపీలు శోభారాణి, పి. సత్యనారాయణ వాదనలు వినిపించారు. కేసు విచారణలో నాగోల్ పోలీస్‌స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ రాజు, సమన్స్ కానిస్టేబుల్ వెంకటేష్, ఏఎస్సై పి. శోభ సహకరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News