నాగోల్, ఆగస్టు 17: పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధిస్తూ ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. నాగోల్ పోలీస్స్టేషన్లో నమోదైన క్రైం నంబర్ 405/2025లో బీఎన్ఎస్ సెక్షన్ 78, పోక్సో చట్టంలోని సెక్షన్ 11 రెడ్ విత్ 12 కింద కేసు నమోదైంది.
ఈ కేసులో నిందితుడు ఉప్పు రాకేష్ (24)ను కోర్టు దోషిగా నిర్ధారించింది. అతనికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3,000 జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి రూ.50,000 పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది.
కేసు దర్యాప్తును నాగోల్ ఎస్ఐ పి. శివ నాగ ప్రసాద్ చేపట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పీపీలు శోభారాణి, పి. సత్యనారాయణ వాదనలు వినిపించారు. కేసు విచారణలో నాగోల్ పోలీస్స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ రాజు, సమన్స్ కానిస్టేబుల్ వెంకటేష్, ఏఎస్సై పి. శోభ సహకరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి