విద్యార్థినులను అభినందించిన స్పెషల్ ఆఫీసర్ కంది భవాని
జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈనెల 16న నిర్వహించిన ఎంపికల్లో చౌటుప్పల్ కేజీబీవీ విద్యార్థినులు విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల, కళాశాల స్పెషల్ ఆఫీసర్ కంది భవాని తెలిపారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ అథ్లెటిక్స్ స్టేడియంలో ఈనెల 26, 27 తేదీలలో జరగనున్న 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి (సౌత్ జోన్) అండర్-14, 16, 18, 20 బాలబాలికల అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో తమ విద్యార్థినులు పాల్గొనడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. అండర్-18 విభాగంలో పి. అంజలి శ్రీ, ఎం. పూజిత, వి. శ్రావణి, ఎం. సిరి, ఆర్. రమ్య శ్రీ, ఏ. అక్షయ, బి. అమృత (ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం).అండర్-14 విభాగంలో బి. మన్విత, కే. అక్షర, ఏ. మోక్ష శ్రీ, ఎస్కే. నాస్య (8, 9వ తరగతులు).రాష్ట్రస్థాయి పోటీలలో విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, పట్టణానికి మంచి పేరు తీసకురావాలని ఎస్ఓ ఆకాంక్షించారు. క్రీడాకారులను తీర్చిదిద్దిన వ్యాయామ ఉపాధ్యాయురాలు (పిఈటి) అనితను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి