Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు దివీస్ ల్యాబొరేటరీస్ సీఎస్ఆర్ నిధులతో నేలపట్ల సమగ్రాభివృద్ధి: యాజమాన్యం హామీ విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 17, 2026 09:07 PM

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కేజీబీవీ విద్యార్థినుల ఎంపిక

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కేజీబీవీ విద్యార్థినుల ఎంపిక

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కేజీబీవీ విద్యార్థినుల ఎంపిక
17-08-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విద్యార్థినులను అభినందించిన స్పెషల్ ఆఫీసర్ కంది భవాని

జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈనెల 16న నిర్వహించిన ఎంపికల్లో చౌటుప్పల్ కేజీబీవీ విద్యార్థినులు విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల, కళాశాల స్పెషల్ ఆఫీసర్ కంది భవాని తెలిపారు. ​హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ అథ్లెటిక్స్ స్టేడియంలో ఈనెల 26, 27 తేదీలలో జరగనున్న 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి (సౌత్ జోన్) అండర్-14, 16, 18, 20 బాలబాలికల అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో తమ విద్యార్థినులు పాల్గొనడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ​అండర్-18 విభాగంలో పి. అంజలి శ్రీ, ఎం. పూజిత, వి. శ్రావణి, ఎం. సిరి, ఆర్. రమ్య శ్రీ, ఏ. అక్షయ, బి. అమృత (ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం).​అండర్-14 విభాగంలో బి. మన్విత, కే. అక్షర, ఏ. మోక్ష శ్రీ, ఎస్కే. నాస్య (8, 9వ తరగతులు).​రాష్ట్రస్థాయి పోటీలలో విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, పట్టణానికి మంచి పేరు తీసకురావాలని ఎస్ఓ ఆకాంక్షించారు. క్రీడాకారులను తీర్చిదిద్దిన వ్యాయామ ఉపాధ్యాయురాలు (పిఈటి) అనితను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

Sthanikam

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కేజీబీవీ విద్యార్థినుల ఎంపిక

Article Image

విద్యార్థినులను అభినందించిన స్పెషల్ ఆఫీసర్ కంది భవాని

జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈనెల 16న నిర్వహించిన ఎంపికల్లో చౌటుప్పల్ కేజీబీవీ విద్యార్థినులు విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల, కళాశాల స్పెషల్ ఆఫీసర్ కంది భవాని తెలిపారు. ​హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ అథ్లెటిక్స్ స్టేడియంలో ఈనెల 26, 27 తేదీలలో జరగనున్న 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి (సౌత్ జోన్) అండర్-14, 16, 18, 20 బాలబాలికల అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో తమ విద్యార్థినులు పాల్గొనడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ​అండర్-18 విభాగంలో పి. అంజలి శ్రీ, ఎం. పూజిత, వి. శ్రావణి, ఎం. సిరి, ఆర్. రమ్య శ్రీ, ఏ. అక్షయ, బి. అమృత (ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం).​అండర్-14 విభాగంలో బి. మన్విత, కే. అక్షర, ఏ. మోక్ష శ్రీ, ఎస్కే. నాస్య (8, 9వ తరగతులు).​రాష్ట్రస్థాయి పోటీలలో విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, పట్టణానికి మంచి పేరు తీసకురావాలని ఎస్ఓ ఆకాంక్షించారు. క్రీడాకారులను తీర్చిదిద్దిన వ్యాయామ ఉపాధ్యాయురాలు (పిఈటి) అనితను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News