Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు దివీస్ ల్యాబొరేటరీస్ సీఎస్ఆర్ నిధులతో నేలపట్ల సమగ్రాభివృద్ధి: యాజమాన్యం హామీ విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 17, 2026 08:21 PM

సీలింగ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై చర్యలు తీసుకోవాలి: అబ్దుల్ రహీం

సీలింగ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై చర్యలు తీసుకోవాలి: అబ్దుల్ రహీం

సీలింగ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై చర్యలు తీసుకోవాలి: అబ్దుల్ రహీం
17-08-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నాగల్గిద్ద మండలం ఔదత్పూర్ గ్రామంలోని ప్రభుత్వ సీలింగ్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన అధికారులు, దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ అబ్దుల్ రహీం డిమాండ్ చేశారు. సోమవారం నాగల్గిద్ద మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఔదత్పూర్ గ్రామంలోని సర్వే నంబర్లు 12, 15లో ఉన్న విలువైన ప్రభుత్వ సీలింగ్ భూములను కొందరు అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా విక్రయించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ భూమి అని తెలిసినప్పటికీ రిజిస్ట్రేషన్లకు సహకరించిన అధికారులు, దళారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై గతంలోనే జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లకు ఆధారాలతో ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని తెలిపారు. వెంటనే అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధితుల తరఫున కమిషన్ ఆధ్వర్యంలో న్యాయపోరాటం చేస్తామని అబ్దుల్ రహీం హెచ్చరించారు.

Sthanikam

సీలింగ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై చర్యలు తీసుకోవాలి: అబ్దుల్ రహీం

Article Image

నాగల్గిద్ద మండలం ఔదత్పూర్ గ్రామంలోని ప్రభుత్వ సీలింగ్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన అధికారులు, దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ అబ్దుల్ రహీం డిమాండ్ చేశారు. సోమవారం నాగల్గిద్ద మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఔదత్పూర్ గ్రామంలోని సర్వే నంబర్లు 12, 15లో ఉన్న విలువైన ప్రభుత్వ సీలింగ్ భూములను కొందరు అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా విక్రయించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ భూమి అని తెలిసినప్పటికీ రిజిస్ట్రేషన్లకు సహకరించిన అధికారులు, దళారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై గతంలోనే జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లకు ఆధారాలతో ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని తెలిపారు. వెంటనే అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధితుల తరఫున కమిషన్ ఆధ్వర్యంలో న్యాయపోరాటం చేస్తామని అబ్దుల్ రహీం హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News