రామన్నపేట ఆగస్టు 17 స్థానికం ప్రతినిధి:
మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి నాలుగు దరఖాస్తులు అందాయి. ఇందులో మండల పంచాయతీ అధికారి పరిధిలో రెండు, తహసీల్దార్కు ఒకటి, ఇరిగేషన్ శాఖ ఏఈకి ఒకటి చొప్పున దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా, సంబంధిత శాఖల అధికారులు వాటిని పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లాల్ బహదూర్, ఎంపీడీఓ ఆవుల రాములు,ఎంపీవో రఫీ, ఏఈలు ఆశిష్ రాఘవ, సురేష్, నవీన్, ఏపీవో వెంకన్న, మెడికల్ ఆఫీసర్, ఎంఈఓ సురేందర్రెడ్డి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కళ్యాణి, ఇరిగేషన్ ఏఈ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి