Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జాతీయ గీతాన్ని అవమానించడం తగదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 18, 2026 07:38 AM

జాతీయ గీతాన్ని అవమానించడం తగదు

జాతీయ గీతాన్ని అవమానించడం తగదు

జాతీయ గీతాన్ని అవమానించడం తగదు
18-08-2026 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో ‘వందేమాతరం’ ఆలపించి నిరసన

కాంగ్రెస్ నాయకులు ‘వందేమాతరం’ గీతాన్ని అవమానించడాన్ని నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక తంగడపల్లి రోడ్డులోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం బీజేవైఎం మండల అధ్యక్షుడు పబ్బు వంశీ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు, విద్యార్థులు కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ముఖ్య అతిథిగా హాజరైన బీజేవైఎం నల్గొండ జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజల్లో దేశభక్తి స్ఫూర్తిని రగిలించిన వందేమాతరం గీతాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. జాతీయ చిహ్నాలు, గీతాలను రాజకీయాలకు అతీతంగా గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భవిష్యత్ తరాలకు స్వాతంత్ర్య సమరయోధుల విలువలు, దేశభక్తిని అందించాలని పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దిండు భాస్కర్, బీజేపీ పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడల భిక్షం గౌడ్, సీనియర్ నాయకులు రమణ గోని శంకర్, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, బత్తుల జంగయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సురేష్, చిరంజీవి, పోలేపల్లి లక్ష్మి, ఉడుగు వెంకటేశం, బీజేవైఎం నాయకులు నాగార్జున, శరత్ కుమార్, గౌతమ్, ప్రకాష్, కార్తీక్, సన్నీ, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

జాతీయ గీతాన్ని అవమానించడం తగదు

Article Image

చౌటుప్పల్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో ‘వందేమాతరం’ ఆలపించి నిరసన

కాంగ్రెస్ నాయకులు ‘వందేమాతరం’ గీతాన్ని అవమానించడాన్ని నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక తంగడపల్లి రోడ్డులోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం బీజేవైఎం మండల అధ్యక్షుడు పబ్బు వంశీ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు, విద్యార్థులు కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ముఖ్య అతిథిగా హాజరైన బీజేవైఎం నల్గొండ జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజల్లో దేశభక్తి స్ఫూర్తిని రగిలించిన వందేమాతరం గీతాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. జాతీయ చిహ్నాలు, గీతాలను రాజకీయాలకు అతీతంగా గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భవిష్యత్ తరాలకు స్వాతంత్ర్య సమరయోధుల విలువలు, దేశభక్తిని అందించాలని పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దిండు భాస్కర్, బీజేపీ పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడల భిక్షం గౌడ్, సీనియర్ నాయకులు రమణ గోని శంకర్, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, బత్తుల జంగయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సురేష్, చిరంజీవి, పోలేపల్లి లక్ష్మి, ఉడుగు వెంకటేశం, బీజేవైఎం నాయకులు నాగార్జున, శరత్ కుమార్, గౌతమ్, ప్రకాష్, కార్తీక్, సన్నీ, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News