చౌటుప్పల్లో బీజేవైఎం ఆధ్వర్యంలో ‘వందేమాతరం’ ఆలపించి నిరసన
కాంగ్రెస్ నాయకులు ‘వందేమాతరం’ గీతాన్ని అవమానించడాన్ని నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక తంగడపల్లి రోడ్డులోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం బీజేవైఎం మండల అధ్యక్షుడు పబ్బు వంశీ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు, విద్యార్థులు కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ముఖ్య అతిథిగా హాజరైన బీజేవైఎం నల్గొండ జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజల్లో దేశభక్తి స్ఫూర్తిని రగిలించిన వందేమాతరం గీతాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. జాతీయ చిహ్నాలు, గీతాలను రాజకీయాలకు అతీతంగా గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భవిష్యత్ తరాలకు స్వాతంత్ర్య సమరయోధుల విలువలు, దేశభక్తిని అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దిండు భాస్కర్, బీజేపీ పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడల భిక్షం గౌడ్, సీనియర్ నాయకులు రమణ గోని శంకర్, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, బత్తుల జంగయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సురేష్, చిరంజీవి, పోలేపల్లి లక్ష్మి, ఉడుగు వెంకటేశం, బీజేవైఎం నాయకులు నాగార్జున, శరత్ కుమార్, గౌతమ్, ప్రకాష్, కార్తీక్, సన్నీ, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి