నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర సర్పంచుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నల్లగొండ జిల్లా అధ్యక్షురాలిగా అన్నెపర్తి గ్రామ సర్పంచ్ మేకల పల్లవి అరవింద్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పల్లవి అరవింద్ రెడ్డిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని సర్పంచుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సర్పంచుల హక్కులు, గ్రామాల అభివృద్ధి కోసం సమష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకట్ రెడ్డితో పాటు నియోజకవర్గంలోని పలువురు సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేకల పల్లవి అరవింద్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి