చిట్యాల: రోడ్డు పక్కన పార్క్ చేసి ఉంచిన లారీలో నుంచి 360 లీటర్ల డీజిల్ను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని భువనగిరి రోడ్డులో చోటుచేసుకుంది. లారీ యజమాని ఉపేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి రోడ్డులో పార్క్ చేసి ఉంచిన లారీలోని డీజిల్ను దుండగుడు చోరీ చేశాడు.
ఈ విషయాన్ని గుర్తించిన యజమాని చిట్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి పాల్పడిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఆధారాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి