Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సూర్యాపేటలో దగ్ధమైన ఆయిల్ ట్యాంకర్ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 18, 2026 03:13 PM

విద్యార్థినుల ఆందోళన.. లెక్చరర్‌పై దాడి

విద్యార్థినుల ఆందోళన.. లెక్చరర్‌పై దాడి

విద్యార్థినుల ఆందోళన.. లెక్చరర్‌పై దాడి
18-08-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

దేవరకొండ: ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో తెలుగు లెక్చరర్‌ భాస్కర్‌ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, తరచూ మద్యం సేవించి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థినులు ఆరోపించారు. ఆయనను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ఎదుట ధర్నాకు దిగారు.ధర్నా కొనసాగుతున్న సమయంలో లెక్చరర్‌ భాస్కర్‌ అక్కడికి రావడంతో ఆగ్రహించిన విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో కళాశాల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థినుల ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని వారు కోరారు.

Sthanikam

విద్యార్థినుల ఆందోళన.. లెక్చరర్‌పై దాడి

Article Image

దేవరకొండ: ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో తెలుగు లెక్చరర్‌ భాస్కర్‌ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, తరచూ మద్యం సేవించి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థినులు ఆరోపించారు. ఆయనను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ఎదుట ధర్నాకు దిగారు.ధర్నా కొనసాగుతున్న సమయంలో లెక్చరర్‌ భాస్కర్‌ అక్కడికి రావడంతో ఆగ్రహించిన విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో కళాశాల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థినుల ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని వారు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News