నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ హత్య కేసుపై స్పందించిన మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరణ.. ఎస్పీకి ఆదేశాలు
(నల్గొండ): నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్, డైరెక్టర్ కుల్లు రూపా రెడ్డి దారుణ హత్య ఘటనను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ కేపాన్ని సుమోటోగా స్వీకరించినట్లు కమిషన్ చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జేబీ కాలనీలోని స్వగృహంలో రూపా రెడ్డి హత్యకు గురై వారం రోజులు గడుస్తున్నా నిందితులను ఇంకా గుర్తించకపోవడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఘటన తీవ్రతను బట్టి కేసు విచారణకు ఆదేశించామని, నిందితులను వెంటనే అరెస్టు చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని నల్గొండ జిల్లా ఎస్పీని ఆదేశించినట్లు పేర్కొన్నారు. మహిళలపై జరిగే ఇటువంటి తీవ్ర నేరాలపై పోలీసులు అత్యంత ప్రాధాన్యతతో స్పందించాలని, బాధితురాలి కుటుంబానికి తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని చైర్పర్సన్ స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తు పురోగతిని మహిళా కమిషన్ నిరంతరం పర్యవేక్షిస్తుందని వెల్లడించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి