నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలాన్ని టీబీ రహిత మండలంగా మార్చే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం మనూర్ గ్రామంలో ప్రత్యేక ఎక్స్రే క్యాంప్ నిర్వహించారు. దీర్ఘకాలంగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి టీబీ అనుమానిత లక్షణాలు ఉన్న 45 మందికి ఉచితంగా ఎక్స్రే పరీక్షలు నిర్వహించారు. అనుమానిత కేసులను త్వరగా గుర్తించి ఉచిత చికిత్స, అవసరమైన పోషకాహారం అందించడమే క్యాంప్ ఉద్దేశమని వైద్యాధికారి డాక్టర్ స్టాలిన్ తెలిపారు. రెండు వారాలకు మించి దగ్గు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని పీహెచ్సీలో పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో దశలవారీగా ఇలాంటి టీబీ పరీక్షా శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు.
PRINT TIME: August 18, 2026 06:25 PM
టీబీ రహిత మనూర్ లక్ష్యంగా ప్రత్యేక ఎక్స్రే క్యాంప్
టీబీ రహిత మనూర్ లక్ష్యంగా ప్రత్యేక ఎక్స్రే క్యాంప్
18-08-2026
18 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలాన్ని టీబీ రహిత మండలంగా మార్చే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం మనూర్ గ్రామంలో ప్రత్యేక ఎక్స్రే క్యాంప్ నిర్వహించారు. దీర్ఘకాలంగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి టీబీ అనుమానిత లక్షణాలు ఉన్న 45 మందికి ఉచితంగా ఎక్స్రే పరీక్షలు నిర్వహించారు. అనుమానిత కేసులను త్వరగా గుర్తించి ఉచిత చికిత్స, అవసరమైన పోషకాహారం అందించడమే క్యాంప్ ఉద్దేశమని వైద్యాధికారి డాక్టర్ స్టాలిన్ తెలిపారు. రెండు వారాలకు మించి దగ్గు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని పీహెచ్సీలో పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో దశలవారీగా ఇలాంటి టీబీ పరీక్షా శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి