Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 18, 2026 06:25 PM

టీబీ రహిత మనూర్‌ లక్ష్యంగా ప్రత్యేక ఎక్స్‌రే క్యాంప్

టీబీ రహిత మనూర్‌ లక్ష్యంగా ప్రత్యేక ఎక్స్‌రే క్యాంప్

టీబీ రహిత మనూర్‌ లక్ష్యంగా ప్రత్యేక ఎక్స్‌రే క్యాంప్
18-08-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్‌ మండలాన్ని టీబీ రహిత మండలంగా మార్చే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మనూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం మనూర్‌ గ్రామంలో ప్రత్యేక ఎక్స్‌రే క్యాంప్‌ నిర్వహించారు. దీర్ఘకాలంగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి టీబీ అనుమానిత లక్షణాలు ఉన్న 45 మందికి ఉచితంగా ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు. అనుమానిత కేసులను త్వరగా గుర్తించి ఉచిత చికిత్స, అవసరమైన పోషకాహారం అందించడమే క్యాంప్‌ ఉద్దేశమని వైద్యాధికారి డాక్టర్‌ స్టాలిన్‌ తెలిపారు. రెండు వారాలకు మించి దగ్గు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని పీహెచ్‌సీలో పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో దశలవారీగా ఇలాంటి టీబీ పరీక్షా శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు.

Sthanikam

టీబీ రహిత మనూర్‌ లక్ష్యంగా ప్రత్యేక ఎక్స్‌రే క్యాంప్

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్‌ మండలాన్ని టీబీ రహిత మండలంగా మార్చే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మనూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం మనూర్‌ గ్రామంలో ప్రత్యేక ఎక్స్‌రే క్యాంప్‌ నిర్వహించారు. దీర్ఘకాలంగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి టీబీ అనుమానిత లక్షణాలు ఉన్న 45 మందికి ఉచితంగా ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు. అనుమానిత కేసులను త్వరగా గుర్తించి ఉచిత చికిత్స, అవసరమైన పోషకాహారం అందించడమే క్యాంప్‌ ఉద్దేశమని వైద్యాధికారి డాక్టర్‌ స్టాలిన్‌ తెలిపారు. రెండు వారాలకు మించి దగ్గు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని పీహెచ్‌సీలో పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో దశలవారీగా ఇలాంటి టీబీ పరీక్షా శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News