నాగల్గిద్ద మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే అధికారులను, ప్రజాప్రతినిధులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా విద్యుత్, తాగునీరు, విద్య, రహదారులు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, పాఠశాలల్లో మౌలిక వసతులు తదితర సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.తాగునీరు, విద్యుత్ సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కారం చూపాలని, పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు రహదారులు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో మండల అధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
మండల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి
మండల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి
Krishna
నాగల్గిద్ద మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే అధికారులను, ప్రజాప్రతినిధులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా విద్యుత్, తాగునీరు, విద్య, రహదారులు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, పాఠశాలల్లో మౌలిక వసతులు తదితర సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.తాగునీరు, విద్యుత్ సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కారం చూపాలని, పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు రహదారులు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో మండల అధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి