నార్కెట్పల్లి సబ్స్టేషన్ను తనిఖీ చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.
రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. మంగళవారం నార్కెట్పల్లి పట్టణంలోని విద్యుత్ సబ్స్టేషన్ను ఆయన తనిఖీ చేసి లాగ్బుక్ను పరిశీలించారు.
మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు తరచూ కాలిపోతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలవుతున్నారని అన్నారు. లాగ్బుక్లో విద్యుత్ సరఫరా, అంతరాయాల వివరాలు సక్రమంగా నమోదు చేయకపోవడం ఆందోళనకరమన్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి