Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 18, 2026 08:23 PM

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ విఫలం

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ విఫలం

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ విఫలం
18-08-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కెట్‌పల్లి సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.


రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. మంగళవారం నార్కెట్‌పల్లి పట్టణంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేసి లాగ్‌బుక్‌ను పరిశీలించారు.

మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు తరచూ కాలిపోతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలవుతున్నారని అన్నారు. లాగ్‌బుక్‌లో విద్యుత్ సరఫరా, అంతరాయాల వివరాలు సక్రమంగా నమోదు చేయకపోవడం ఆందోళనకరమన్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

Sthanikam

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ విఫలం

Article Image

నార్కెట్‌పల్లి సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.


రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. మంగళవారం నార్కెట్‌పల్లి పట్టణంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేసి లాగ్‌బుక్‌ను పరిశీలించారు.

మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు తరచూ కాలిపోతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలవుతున్నారని అన్నారు. లాగ్‌బుక్‌లో విద్యుత్ సరఫరా, అంతరాయాల వివరాలు సక్రమంగా నమోదు చేయకపోవడం ఆందోళనకరమన్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News