Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్లూ జాయ్ చైర్మన్ వీరబాబును అభినందించి సన్మానించిన హ్యూమన్ రైట్స్ డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 23, 2026 07:56 PM

బాలాజీ అనురాధ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎంపీ

బాలాజీ అనురాధ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎంపీ

బాలాజీ అనురాధ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎంపీ
23-08-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ అనురాధ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె. మదన్ మోహన్ రావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులతో పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో వైద్యం అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు. నారాయణఖేడ్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు, అత్యవసర చికిత్సలు నిరంతరం అందుబాటులో ఉంచుతామని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్, జిల్లా కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, వైద్యులు, పట్టణ ప్రముఖులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

బాలాజీ అనురాధ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎంపీ

Article Image

పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ అనురాధ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె. మదన్ మోహన్ రావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులతో పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో వైద్యం అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు. నారాయణఖేడ్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు, అత్యవసర చికిత్సలు నిరంతరం అందుబాటులో ఉంచుతామని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్, జిల్లా కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, వైద్యులు, పట్టణ ప్రముఖులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News