పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ అనురాధ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె. మదన్ మోహన్ రావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులతో పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో వైద్యం అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు. నారాయణఖేడ్తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు, అత్యవసర చికిత్సలు నిరంతరం అందుబాటులో ఉంచుతామని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్, జిల్లా కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, వైద్యులు, పట్టణ ప్రముఖులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బాలాజీ అనురాధ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎంపీ
బాలాజీ అనురాధ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎంపీ
Krishna
పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ అనురాధ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె. మదన్ మోహన్ రావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులతో పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో వైద్యం అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు. నారాయణఖేడ్తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు, అత్యవసర చికిత్సలు నిరంతరం అందుబాటులో ఉంచుతామని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్, జిల్లా కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, వైద్యులు, పట్టణ ప్రముఖులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి