నల్లగొండ: ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ IFTU, CITU, AITUC, BRTU సంఘాల ఆధ్వర్యంలో శనివారం నల్లగొండ పట్టణంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ఎన్జీ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీలో పెద్ద సంఖ్యలో ఆటోలు పాల్గొన్నాయి. అనంతరం నిర్వహించిన సభలో కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు.
ఆర్టీసీ రంగంలో ఈవీ ఆటోలను ప్రవేశపెట్టడం వల్ల సంప్రదాయ ఆటో కార్మికుల జీవనోపాధి దెబ్బతింటోందని పేర్కొన్నారు. ఈవీ ఆటోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, ప్రతి కార్మికుడికి ప్రమాద బీమా కల్పించాలని కోరారు. ప్రమాదాలకు గురైన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 50 ఏళ్లు దాటిన ఆటో కార్మికులకు నెలవారీ పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు.
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆదివారం నిర్వహించనున్న ఆటోల బంద్ను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్మికులంతా ఐక్యంగా బంద్లో పాల్గొనాలని కోరారు.
కార్యక్రమంలో IFTU జిల్లా అధ్యక్షుడు బి.నర్సింహ, కార్యదర్శి బొమ్మిడి నగేష్, AITUC నాయకుడు లెనిన్ కేస్రెడ్డి, CITU జిల్లా సహాయ కార్యదర్శి అవుట రవీందర్, అద్దంకి నరసింహ, హనుమంతు నాయక్, BRTU జిల్లా కార్యదర్శి గుర్రం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి