Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలాజీ అనురాధ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎంపీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 23, 2026 06:55 PM

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.. రేపటి బంద్‌ను విజయవంతంచేయాలి.

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.. రేపటి బంద్‌ను విజయవంతంచేయాలి.

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.. రేపటి బంద్‌ను విజయవంతంచేయాలి.
23-08-2026 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ: ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ IFTU, CITU, AITUC, BRTU సంఘాల ఆధ్వర్యంలో శనివారం నల్లగొండ పట్టణంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ఎన్‌జీ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీలో పెద్ద సంఖ్యలో ఆటోలు పాల్గొన్నాయి. అనంతరం నిర్వహించిన సభలో కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు.

ఆర్‌టీసీ రంగంలో ఈవీ ఆటోలను ప్రవేశపెట్టడం వల్ల సంప్రదాయ ఆటో కార్మికుల జీవనోపాధి దెబ్బతింటోందని పేర్కొన్నారు. ఈవీ ఆటోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆటో కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, ప్రతి కార్మికుడికి ప్రమాద బీమా కల్పించాలని కోరారు. ప్రమాదాలకు గురైన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 50 ఏళ్లు దాటిన ఆటో కార్మికులకు నెలవారీ పింఛన్‌ అందించాలని డిమాండ్‌ చేశారు.

తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆదివారం నిర్వహించనున్న ఆటోల బంద్‌ను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్మికులంతా ఐక్యంగా బంద్‌లో పాల్గొనాలని కోరారు.

కార్యక్రమంలో IFTU జిల్లా అధ్యక్షుడు బి.నర్సింహ, కార్యదర్శి బొమ్మిడి నగేష్, AITUC నాయకుడు లెనిన్ కేస్‌రెడ్డి, CITU జిల్లా సహాయ కార్యదర్శి అవుట రవీందర్, అద్దంకి నరసింహ, హనుమంతు నాయక్, BRTU జిల్లా కార్యదర్శి గుర్రం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.. రేపటి బంద్‌ను విజయవంతంచేయాలి.

Article Image

నల్లగొండ: ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ IFTU, CITU, AITUC, BRTU సంఘాల ఆధ్వర్యంలో శనివారం నల్లగొండ పట్టణంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ఎన్‌జీ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీలో పెద్ద సంఖ్యలో ఆటోలు పాల్గొన్నాయి. అనంతరం నిర్వహించిన సభలో కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు.

ఆర్‌టీసీ రంగంలో ఈవీ ఆటోలను ప్రవేశపెట్టడం వల్ల సంప్రదాయ ఆటో కార్మికుల జీవనోపాధి దెబ్బతింటోందని పేర్కొన్నారు. ఈవీ ఆటోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆటో కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, ప్రతి కార్మికుడికి ప్రమాద బీమా కల్పించాలని కోరారు. ప్రమాదాలకు గురైన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 50 ఏళ్లు దాటిన ఆటో కార్మికులకు నెలవారీ పింఛన్‌ అందించాలని డిమాండ్‌ చేశారు.

తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆదివారం నిర్వహించనున్న ఆటోల బంద్‌ను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్మికులంతా ఐక్యంగా బంద్‌లో పాల్గొనాలని కోరారు.

కార్యక్రమంలో IFTU జిల్లా అధ్యక్షుడు బి.నర్సింహ, కార్యదర్శి బొమ్మిడి నగేష్, AITUC నాయకుడు లెనిన్ కేస్‌రెడ్డి, CITU జిల్లా సహాయ కార్యదర్శి అవుట రవీందర్, అద్దంకి నరసింహ, హనుమంతు నాయక్, BRTU జిల్లా కార్యదర్శి గుర్రం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News