సీసీ కెమెరాలతో నేరస్తులకు చెక్.. ప్రజల భద్రతకు భరోసా
నల్గొండ: ప్రజా భద్రతకు సీసీ కెమెరాలు రక్షణ కవచంలా పనిచేస్తాయని నల్గొండ సబ్డివిజన్ డీఎస్పీ శివరాం రెడ్డి అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా నల్గొండ టూ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని 18వ వార్డులో ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను ఆదివారం ఆయన ప్రారంభించారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మాజీ కౌన్సిలర్లు గడిగ హిమబిందు, గడిగ శ్రీను సహకారంతో కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా, నేరస్తులను త్వరగా గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలకంగా ఉపయోగపడతాయని తెలిపారు.
టూ టౌన్ పరిధిలోని అన్ని వార్డుల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘాలు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతోనే కమ్యూనిటీ పోలీసింగ్ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో టూ టౌన్ సీఐ ఆదిరెడ్డి, ఎస్ఐ సైదాబాబు తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గడిగ హిమబిందు, గడిగ శ్రీనులను పోలీసు అధికారులు అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి