Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మురళీ గురుస్వామికి ఘనంగా 'ఉత్తమ గురు పురస్కారం' ప్రదానం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 23, 2026 05:59 PM

నేరాల కట్టడికి సీసీ కెమెరాలు కీలకం.డీఎస్పీ

నేరాల కట్టడికి సీసీ కెమెరాలు కీలకం.డీఎస్పీ

నేరాల కట్టడికి సీసీ కెమెరాలు కీలకం.డీఎస్పీ
23-08-2026 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సీసీ కెమెరాలతో నేరస్తులకు చెక్‌.. ప్రజల భద్రతకు భరోసా

నల్గొండ: ప్రజా భద్రతకు సీసీ కెమెరాలు రక్షణ కవచంలా పనిచేస్తాయని నల్గొండ సబ్‌డివిజన్ డీఎస్పీ శివరాం రెడ్డి అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా నల్గొండ టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 18వ వార్డులో ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను ఆదివారం ఆయన ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మాజీ కౌన్సిలర్లు గడిగ హిమబిందు, గడిగ శ్రీను సహకారంతో కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా, నేరస్తులను త్వరగా గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలకంగా ఉపయోగపడతాయని తెలిపారు.

టూ టౌన్ పరిధిలోని అన్ని వార్డుల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘాలు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతోనే కమ్యూనిటీ పోలీసింగ్ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో టూ టౌన్ సీఐ ఆదిరెడ్డి, ఎస్‌ఐ సైదాబాబు తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గడిగ హిమబిందు, గడిగ శ్రీనులను పోలీసు అధికారులు అభినందించారు.

Sthanikam

నేరాల కట్టడికి సీసీ కెమెరాలు కీలకం.డీఎస్పీ

Article Image

సీసీ కెమెరాలతో నేరస్తులకు చెక్‌.. ప్రజల భద్రతకు భరోసా

నల్గొండ: ప్రజా భద్రతకు సీసీ కెమెరాలు రక్షణ కవచంలా పనిచేస్తాయని నల్గొండ సబ్‌డివిజన్ డీఎస్పీ శివరాం రెడ్డి అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా నల్గొండ టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 18వ వార్డులో ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను ఆదివారం ఆయన ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మాజీ కౌన్సిలర్లు గడిగ హిమబిందు, గడిగ శ్రీను సహకారంతో కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా, నేరస్తులను త్వరగా గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలకంగా ఉపయోగపడతాయని తెలిపారు.

టూ టౌన్ పరిధిలోని అన్ని వార్డుల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘాలు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతోనే కమ్యూనిటీ పోలీసింగ్ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో టూ టౌన్ సీఐ ఆదిరెడ్డి, ఎస్‌ఐ సైదాబాబు తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గడిగ హిమబిందు, గడిగ శ్రీనులను పోలీసు అధికారులు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News