చైతన్యపురి: ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన చిన్న ఆలయంలోని దుర్గామాత విగ్రహాలు మాయమయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన సరూర్నగర్ పోలీసులు ఇద్దరు మహిళలను అరెస్టు చేసి, చోరీకి గురైన రెండు విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇందిరమ్మ తన నివాసంలో దుర్గామాత ఆలయాన్ని ఏర్పాటు చేసి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 21న పొరుగింటికి చెందిన సింగిశెట్టి లక్ష్మీబాయి ఆలయంలో దీపం వెలిగించారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరిగి దీపం వెలిగించేందుకు వెళ్లగా విగ్రహాలు కనిపించకపోవడంతో ఇందిరమ్మకు సమాచారం ఇచ్చారు.
అంబటి సంతోష్కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కదమంచి రాములమ్మ, ఉబడి వెంకటమ్మలను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు దుర్గామాత విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు సీఐ శ్రీశైలం తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి