తుంగతుర్తి;
ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీటిని విడుదల చేసి తుంగతుర్తి ప్రాంత రైతులను ఆదుకోవాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరి రావు డిమాండ్ చేశారు ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయము నందు అపార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ వర్షాభావ ప్రభావం వలన తుంగతుర్తి ప్రాంతంలో రైతులు వేసుకున్న వరి పంట ఆదిలోనే ఎండిపోతుందని పెట్టుబడి పెట్టి కళ్ళముందే రైతుల పంట ఎండిపోవడం చేత నిరాశ చెందుతున్నారని ఎస్సారెస్పీ గోదావరి జలాలచే నిండి ఉన్నందున ఆ నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు ఇప్పటికే రైతులు యూరియా దొరకక విపరీతమైనటువంటి ఎరువుల రేట్లు పెంచడం వలన పంటను సాగు చేసి నిరాశతో ఉన్నారని కనీసం పెట్టుబడుల కోసం అయినా పంటలు తీయాలని రైతులు ఎదురుచూస్తున్నారని అందుకే ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీటిని వదిలి భూగర్భ జలాలు అడుగంటిన కారణంగా చెరువులను నింపడం చేత కొంత బావులలో గాని బోర్లలో గాని నీరు ఎక్కువై పంటలకు అందించే ప్రయత్నం జరుగుతుందని ఇక్కడున్న అధికారులు కానీ పాలకులు గానీ నిర్లక్ష్యం వీడి రైతుల వైపు ఆలోచించి ఆదుకోవాలని వారు కోరారు ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం ప్రజా సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని నూతనంగా అర్హత కలిగిన వారికి పింఛన్లు ఇవ్వాలని రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను నిరుపేదలకు రాజకీయాలకు అతీతంగా ఇవ్వాలని వారు కోరారు తుంగతుర్తి మండల కేంద్రంలో మరియు వివిధ గ్రామాలలో లింక్ అయిన రోడ్లు అద్వానంగా మారి ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నందున వెంటనే వాటి రిపేర్ చేయించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాసు పులుసు సత్యం మండల కార్యదర్శిలు దేవరకొండ యాదగిరి జి ఉప్పలయ్య పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి