Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్వచ్ఛంద సేవలతో జహీరాబాద్ అభివృద్ధికి కృషి చేయాలి:అధ్యక్షురాలు అస్మా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 22, 2026 09:49 PM

జహీరాబాద్ బాధితులకు భారీ షాక్.. రూ.28.14 కోట్ల పెట్టుబడులు మాయం

జహీరాబాద్ బాధితులకు భారీ షాక్.. రూ.28.14 కోట్ల పెట్టుబడులు మాయం

జహీరాబాద్ బాధితులకు భారీ షాక్.. రూ.28.14 కోట్ల పెట్టుబడులు మాయం
22-08-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అధిక లాభాలు వస్తాయనే ఆశ చూపించి గోల్డ్, సిల్వర్ వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించిన అనంతరం డబ్బులు, రాబడులు తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన ఘటన జహీరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. జహీరాబాద్ టౌన్‌కు చెందిన మిదిదొడ్డి ఇజ్రాయేలు బాబి, కొత్త శశిధర్ రెడ్డి, నాగరిగారి విల్లీ ఫ్రాన్సిస్, పోతురాజు అరవింద్‌తో పాటు మరో 22 మంది గత రెండేళ్లుగా హైదరాబాద్‌లోని నాయకీ ట్రేడర్స్ సంస్థలో సుమారు రూ.28 కోట్ల 14 లక్షల 57 వేల 128 పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. మొదట్లో కొన్ని నెలల పాటు పెట్టుబడులపై వడ్డీ, లాభాల రూపంలో డబ్బులు చెల్లిస్తూ సంస్థ నిర్వాహకులు బాధితుల్లో నమ్మకం కల్పించినట్లు తెలిపారు. దీంతో సంస్థపై నమ్మకం పెరగడంతో బాధితులు విడతల వారీగా వివిధ లావాదేవీల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులను పెట్టుబడిగా అందించారు. అనంతరం పెట్టుబడులకు ఎలాంటి రాబడులు ఇవ్వకపోవడంతో పాటు అసలు మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించకుండా మోసం చేసినట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు మిదిదొడ్డి ఇజ్రాయేలు బాబి, కొత్త శశిధర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రెండు వేర్వేరు మోసం కేసులు నమోదు చేశారు. ఎస్‌ఐ లవకుమార్, సీఐ ఆర్. రవి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో మల్లెం శేషువర్ధన రెడ్డి శశువర్ధన్ రెడ్డి, బగ్గి రవీంద్రబాబు @ రవీందర్, దేవుల జగదీష్, పిండి సుష్మిత ఉన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

Sthanikam

జహీరాబాద్ బాధితులకు భారీ షాక్.. రూ.28.14 కోట్ల పెట్టుబడులు మాయం

Article Image

అధిక లాభాలు వస్తాయనే ఆశ చూపించి గోల్డ్, సిల్వర్ వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించిన అనంతరం డబ్బులు, రాబడులు తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన ఘటన జహీరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. జహీరాబాద్ టౌన్‌కు చెందిన మిదిదొడ్డి ఇజ్రాయేలు బాబి, కొత్త శశిధర్ రెడ్డి, నాగరిగారి విల్లీ ఫ్రాన్సిస్, పోతురాజు అరవింద్‌తో పాటు మరో 22 మంది గత రెండేళ్లుగా హైదరాబాద్‌లోని నాయకీ ట్రేడర్స్ సంస్థలో సుమారు రూ.28 కోట్ల 14 లక్షల 57 వేల 128 పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. మొదట్లో కొన్ని నెలల పాటు పెట్టుబడులపై వడ్డీ, లాభాల రూపంలో డబ్బులు చెల్లిస్తూ సంస్థ నిర్వాహకులు బాధితుల్లో నమ్మకం కల్పించినట్లు తెలిపారు. దీంతో సంస్థపై నమ్మకం పెరగడంతో బాధితులు విడతల వారీగా వివిధ లావాదేవీల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులను పెట్టుబడిగా అందించారు. అనంతరం పెట్టుబడులకు ఎలాంటి రాబడులు ఇవ్వకపోవడంతో పాటు అసలు మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించకుండా మోసం చేసినట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు మిదిదొడ్డి ఇజ్రాయేలు బాబి, కొత్త శశిధర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రెండు వేర్వేరు మోసం కేసులు నమోదు చేశారు. ఎస్‌ఐ లవకుమార్, సీఐ ఆర్. రవి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో మల్లెం శేషువర్ధన రెడ్డి శశువర్ధన్ రెడ్డి, బగ్గి రవీంద్రబాబు @ రవీందర్, దేవుల జగదీష్, పిండి సుష్మిత ఉన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News