Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పేదల పెన్నిధి సురవరం: పల్లె శేఖర్ రెడ్డి మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 22, 2026 06:07 PM

పేదల పెన్నిధి సురవరం: పల్లె శేఖర్ రెడ్డి

పేదల పెన్నిధి సురవరం: పల్లె శేఖర్ రెడ్డి

పేదల పెన్నిధి సురవరం: పల్లె శేఖర్ రెడ్డి
22-08-2026 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతిని చౌటుప్పల్ సీపీఐ కార్యాలయంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.​ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఏఐఎస్ఎఫ్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సురవరం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా దేశవ్యాప్తంగా పోరాటాలను విస్తరించారని కొనియాడారు.​1998, 2004లలో ఎంపీగా గెలిచి ఉపాధి హామీ, సమాచార హక్కు చట్టాల సాధనలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఫ్లోరైడ్ సమస్య, రాచకొండ ఫైరింగ్ రేంజ్ రద్దు, డిండి, నక్కలగండి ప్రాజెక్టుల కోసం ఆయన చేసిన పోరాటాలు అమోఘమని గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.​ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పగిల్ల మోహన్ రెడ్డి, ఉడుత రామలింగం, వెంకటేష్, రాములు, నర్సింహా, సుధాకర్, బిక్షపతి, రహమాన్, కృష్ణ, దర్శన్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేదల పెన్నిధి సురవరం: పల్లె శేఖర్ రెడ్డి

Article Image

సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతిని చౌటుప్పల్ సీపీఐ కార్యాలయంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.​ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఏఐఎస్ఎఫ్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సురవరం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా దేశవ్యాప్తంగా పోరాటాలను విస్తరించారని కొనియాడారు.​1998, 2004లలో ఎంపీగా గెలిచి ఉపాధి హామీ, సమాచార హక్కు చట్టాల సాధనలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఫ్లోరైడ్ సమస్య, రాచకొండ ఫైరింగ్ రేంజ్ రద్దు, డిండి, నక్కలగండి ప్రాజెక్టుల కోసం ఆయన చేసిన పోరాటాలు అమోఘమని గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.​ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పగిల్ల మోహన్ రెడ్డి, ఉడుత రామలింగం, వెంకటేష్, రాములు, నర్సింహా, సుధాకర్, బిక్షపతి, రహమాన్, కృష్ణ, దర్శన్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News