సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతిని చౌటుప్పల్ సీపీఐ కార్యాలయంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఏఐఎస్ఎఫ్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సురవరం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా దేశవ్యాప్తంగా పోరాటాలను విస్తరించారని కొనియాడారు.1998, 2004లలో ఎంపీగా గెలిచి ఉపాధి హామీ, సమాచార హక్కు చట్టాల సాధనలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఫ్లోరైడ్ సమస్య, రాచకొండ ఫైరింగ్ రేంజ్ రద్దు, డిండి, నక్కలగండి ప్రాజెక్టుల కోసం ఆయన చేసిన పోరాటాలు అమోఘమని గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పగిల్ల మోహన్ రెడ్డి, ఉడుత రామలింగం, వెంకటేష్, రాములు, నర్సింహా, సుధాకర్, బిక్షపతి, రహమాన్, కృష్ణ, దర్శన్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
పేదల పెన్నిధి సురవరం: పల్లె శేఖర్ రెడ్డి
పేదల పెన్నిధి సురవరం: పల్లె శేఖర్ రెడ్డి
K.RAVI
సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతిని చౌటుప్పల్ సీపీఐ కార్యాలయంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఏఐఎస్ఎఫ్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సురవరం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా దేశవ్యాప్తంగా పోరాటాలను విస్తరించారని కొనియాడారు.1998, 2004లలో ఎంపీగా గెలిచి ఉపాధి హామీ, సమాచార హక్కు చట్టాల సాధనలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఫ్లోరైడ్ సమస్య, రాచకొండ ఫైరింగ్ రేంజ్ రద్దు, డిండి, నక్కలగండి ప్రాజెక్టుల కోసం ఆయన చేసిన పోరాటాలు అమోఘమని గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పగిల్ల మోహన్ రెడ్డి, ఉడుత రామలింగం, వెంకటేష్, రాములు, నర్సింహా, సుధాకర్, బిక్షపతి, రహమాన్, కృష్ణ, దర్శన్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి