వెలిమినేడు: వెలిమినేడు గ్రామంలో ఘనంగా నిర్వహించనున్న బోనాల ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించింది. గ్రామంలో జరిగే బోనాల వేడుకలకు ఎమ్మెల్యే హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బొంతల అంజిరెడ్డి, ఉపసర్పంచ్ అంతటి స్వప్న సత్తయ్యగౌడ్, వార్డు సభ్యులు జనగాం మంగమ్మ–సత్యనారాయణ, వరికుప్పల సంగీత–సుధాకర్, చిర్రగోని శ్రీశైలం, జినకల నాగమణి–జంగయ్య, చింతకింది వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి తాటికొండ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి