Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రూపా రెడ్డి హత్యకు నిరసనగా కదిలిన విద్యా సమాజం నల్లగొండలో TRSMA ఆధ్వర్యంలో భారీ సంఘీభావ ర్యాలీ.. నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 21, 2026 11:53 PM

మున్నూరు కాపు విద్యార్థుల భవిష్యత్తుకు బాసట.. వసతిగృహ నిర్మాణానికి భూమిపూజ

మున్నూరు కాపు విద్యార్థుల భవిష్యత్తుకు బాసట.. వసతిగృహ నిర్మాణానికి భూమిపూజ

మున్నూరు కాపు విద్యార్థుల భవిష్యత్తుకు బాసట.. వసతిగృహ నిర్మాణానికి భూమిపూజ
21-08-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

నల్లగొండలో ఘనంగా ప్రారంభమైన నిర్మాణ పనులు.. నిధుల సమీకరణకు సహకరిస్తాం: నేతి విద్యాసాగర్, పూల రవీందర్

నల్లగొండ పట్టణంలో మున్నూరు కాపు విద్యార్థుల కోసం నిర్మించనున్న విద్యార్థి వసతిగృహానికి శుక్రవారం భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎన్‌ఎన్‌ఆర్‌ఎస్ గార్డెన్స్ సమీపంలో మున్నూరు కాపు విద్యార్థి వసతిగృహ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు నేతి రఘుపతి నేతృత్వంలో ఏర్పాటు చేశారు. శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నేతి విద్యాసాగర్, పూల రవీందర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి నల్లగొండ పట్టణానికి చదువుకునేందుకు వచ్చే మున్నూరు కాపు విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో వసతిగృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించడంతోపాటు చదువుకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చని అన్నారు.

వసతిగృహ భవన నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణలో తమ వంతు సహకారం అందిస్తామని వారు తెలిపారు. నల్లగొండ జిల్లాలోని మున్నూరు కాపు కుల బంధువులు, సంఘాల నాయకులు, దాతలు ఈ నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమాజంలోని ప్రతి ఒక్కరి సహకారంతో వసతిగృహ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, దాతల నుంచి కూడా నిధులు సమీకరించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేపడుతున్న ఈ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు నేతి రఘుపతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నత విద్య కోసం నల్లగొండకు వచ్చే విద్యార్థులకు సరసమైన, సౌకర్యవంతమైన వసతి అందించడమే ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వసతిగృహ నిర్మాణాన్ని దశలవారీగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి తోకల వెంకటకృష్ణ, కోశాధికారి నేతి ఉమామహేశ్వర్, గౌరవ అధ్యక్షుడు కాటం సునీల్, ఉపాధ్యక్షుడు మేకల వెంకన్న, సహాయ కార్యదర్శి రామగిరి వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యుడు కంచనపల్లి జవహర్‌లాల్, పీఎంకేజేఎఫ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు తూడి జనార్దన్ పటేల్, నాగులంచ స్వామి, ట్రస్ట్ బోర్డు సభ్యులు వాసుదేవుల వెంకట నరసయ్య, శేషనాల రఘువీర్, వొలి సమీర్ కుమార్, గాలి వెంకటేశ్వరరావు, వైద్యం వెంకటేశ్వర్లు, కేసిడి వెంకట నరసయ్య, నాగులపల్లి శ్యాంసుందర్, జువాజీ ఇంద్రయ్య, కంచి సత్యనారాయణ, పందిరి వేణు, వీడియో జర్నలిస్ట్ చేపూరి రవి, సంఘం నాయకులు పందిరి వెంకటేశ్వరమూర్తి, సుధాకర్, వసంతరావు, పంతులు శ్రీనివాస్, ప్రవీణ్, పజ్జురి గిరి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మున్నూరు కాపు విద్యార్థుల భవిష్యత్తుకు బాసట.. వసతిగృహ నిర్మాణానికి భూమిపూజ

Article Image

నల్లగొండలో ఘనంగా ప్రారంభమైన నిర్మాణ పనులు.. నిధుల సమీకరణకు సహకరిస్తాం: నేతి విద్యాసాగర్, పూల రవీందర్

నల్లగొండ పట్టణంలో మున్నూరు కాపు విద్యార్థుల కోసం నిర్మించనున్న విద్యార్థి వసతిగృహానికి శుక్రవారం భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎన్‌ఎన్‌ఆర్‌ఎస్ గార్డెన్స్ సమీపంలో మున్నూరు కాపు విద్యార్థి వసతిగృహ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు నేతి రఘుపతి నేతృత్వంలో ఏర్పాటు చేశారు. శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నేతి విద్యాసాగర్, పూల రవీందర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి నల్లగొండ పట్టణానికి చదువుకునేందుకు వచ్చే మున్నూరు కాపు విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో వసతిగృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించడంతోపాటు చదువుకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చని అన్నారు.

వసతిగృహ భవన నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణలో తమ వంతు సహకారం అందిస్తామని వారు తెలిపారు. నల్లగొండ జిల్లాలోని మున్నూరు కాపు కుల బంధువులు, సంఘాల నాయకులు, దాతలు ఈ నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమాజంలోని ప్రతి ఒక్కరి సహకారంతో వసతిగృహ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, దాతల నుంచి కూడా నిధులు సమీకరించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేపడుతున్న ఈ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు నేతి రఘుపతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నత విద్య కోసం నల్లగొండకు వచ్చే విద్యార్థులకు సరసమైన, సౌకర్యవంతమైన వసతి అందించడమే ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వసతిగృహ నిర్మాణాన్ని దశలవారీగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి తోకల వెంకటకృష్ణ, కోశాధికారి నేతి ఉమామహేశ్వర్, గౌరవ అధ్యక్షుడు కాటం సునీల్, ఉపాధ్యక్షుడు మేకల వెంకన్న, సహాయ కార్యదర్శి రామగిరి వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యుడు కంచనపల్లి జవహర్‌లాల్, పీఎంకేజేఎఫ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు తూడి జనార్దన్ పటేల్, నాగులంచ స్వామి, ట్రస్ట్ బోర్డు సభ్యులు వాసుదేవుల వెంకట నరసయ్య, శేషనాల రఘువీర్, వొలి సమీర్ కుమార్, గాలి వెంకటేశ్వరరావు, వైద్యం వెంకటేశ్వర్లు, కేసిడి వెంకట నరసయ్య, నాగులపల్లి శ్యాంసుందర్, జువాజీ ఇంద్రయ్య, కంచి సత్యనారాయణ, పందిరి వేణు, వీడియో జర్నలిస్ట్ చేపూరి రవి, సంఘం నాయకులు పందిరి వెంకటేశ్వరమూర్తి, సుధాకర్, వసంతరావు, పంతులు శ్రీనివాస్, ప్రవీణ్, పజ్జురి గిరి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News