మద్దిరాల మండలంలోని చందుపట్ల గ్రామ శివరామ క్షేత్రంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకుడు ముడుంబై రఘువరన్ ఆచార్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించారు. అనంతరం మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. రూ.1,73,216 విలువైన నగదు, ఆభరణాలతో అమ్మవారిని ధనలక్ష్మిగా అలంకరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
PRINT TIME: August 21, 2026 10:03 PM
రూ.1.73 లక్షలతో అమ్మవారి అలంకరణ
రూ.1.73 లక్షలతో అమ్మవారి అలంకరణ
21-08-2026
2 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
మద్దిరాల మండలంలోని చందుపట్ల గ్రామ శివరామ క్షేత్రంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకుడు ముడుంబై రఘువరన్ ఆచార్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించారు. అనంతరం మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. రూ.1,73,216 విలువైన నగదు, ఆభరణాలతో అమ్మవారిని ధనలక్ష్మిగా అలంకరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి