రామన్నపేట
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ యాదాద్రి భువనగిరి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులైన బోగారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది గంపల జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా అధికారుల చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశంకు ధన్యవాదాలు తెలిపారు. కమిటీ సభ్యుడిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ షెడ్యూల్డ్ కులాల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు.
తన నియామకానికి సహకరించిన రామన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న జగన్మోహన్, జిల్లా నాయకుడు గంగుల రాజిరెడ్డి, బోగారం గ్రామ శాఖ అధ్యక్షుడు మద్దెలపురి ఐలయ్య, మాజీ సర్పంచ్ గంపల రామచంద్రారెడ్డి, గోగు సత్తయ్య, బొడ్డుపల్లి లింగయ్య, ఎండీ ఇమామ్, గోగు హరిప్రసాద్, చీరకొని నవీన్, గోగు సురేష్, కానుక మల్లేష్ తదితరులకు జీవన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి