Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భూమిని హిందూ ధార్మిక సంస్థలకు కేటాయించాలి. తరగతి గదిలో గురువులు.. ఉద్యోగంలో మాత్రం అతిథులే! కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 20, 2026 08:09 PM

భూమిని హిందూ ధార్మిక సంస్థలకు కేటాయించాలి.

భూమిని హిందూ ధార్మిక సంస్థలకు కేటాయించాలి.

భూమిని హిందూ ధార్మిక సంస్థలకు కేటాయించాలి.
20-08-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పట్టణంలోని భువనగిరి రోడ్డులో కల్యాణ మండపం నిర్మాణం కోసం దాతల విరాళాల సహకారంతో కొనుగోలు చేసిన భూమిని హిందూ ధార్మిక సంస్థలకు కేటాయించాలని చిట్యాల పట్టణ హిందూ బంధువుల సమితి ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సమితి ప్రతినిధులు తేరేటుపల్లి హనుమంతు, సకినాల సుధాకర్, కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, మెండె వెంకన్న , జిట్టా నరేష్ గురువారం రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాజీ ఎమ్మెల్సీ చెరుపెల్లి సీతారాములకు వినతి పత్రాన్ని అందజేశారు.

కల్యాణ మండపం నిర్మాణం కోసం ప్రజలు, దాతల సహకారంతో కొనుగోలు చేసిన భూమిని ఇతర అవసరాలకు వినియోగించడం సమంజసం కాదని వారు పేర్కొన్నారు. హిందూ ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక అవసరాలకు ఉపయోగపడేలా ఆ భూమిని సంబంధిత హిందూ ధార్మిక సంస్థలకు కేటాయించాలని కోరారు.

ప్రజల సహకారంతో సమకూర్చిన భూమి ఉద్దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలపై ఉందన్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని భూమిని హిందూ ధార్మిక సంస్థలకు కేటాయించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రజలు కూడా ఈ అంశంలో సహకరించాలని వారు కోరారు.

Sthanikam

భూమిని హిందూ ధార్మిక సంస్థలకు కేటాయించాలి.

Article Image

చిట్యాల పట్టణంలోని భువనగిరి రోడ్డులో కల్యాణ మండపం నిర్మాణం కోసం దాతల విరాళాల సహకారంతో కొనుగోలు చేసిన భూమిని హిందూ ధార్మిక సంస్థలకు కేటాయించాలని చిట్యాల పట్టణ హిందూ బంధువుల సమితి ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సమితి ప్రతినిధులు తేరేటుపల్లి హనుమంతు, సకినాల సుధాకర్, కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, మెండె వెంకన్న , జిట్టా నరేష్ గురువారం రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాజీ ఎమ్మెల్సీ చెరుపెల్లి సీతారాములకు వినతి పత్రాన్ని అందజేశారు.

కల్యాణ మండపం నిర్మాణం కోసం ప్రజలు, దాతల సహకారంతో కొనుగోలు చేసిన భూమిని ఇతర అవసరాలకు వినియోగించడం సమంజసం కాదని వారు పేర్కొన్నారు. హిందూ ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక అవసరాలకు ఉపయోగపడేలా ఆ భూమిని సంబంధిత హిందూ ధార్మిక సంస్థలకు కేటాయించాలని కోరారు.

ప్రజల సహకారంతో సమకూర్చిన భూమి ఉద్దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలపై ఉందన్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని భూమిని హిందూ ధార్మిక సంస్థలకు కేటాయించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రజలు కూడా ఈ అంశంలో సహకరించాలని వారు కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News