చిట్యాల పట్టణంలోని భువనగిరి రోడ్డులో కల్యాణ మండపం నిర్మాణం కోసం దాతల విరాళాల సహకారంతో కొనుగోలు చేసిన భూమిని హిందూ ధార్మిక సంస్థలకు కేటాయించాలని చిట్యాల పట్టణ హిందూ బంధువుల సమితి ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సమితి ప్రతినిధులు తేరేటుపల్లి హనుమంతు, సకినాల సుధాకర్, కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, మెండె వెంకన్న , జిట్టా నరేష్ గురువారం రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాజీ ఎమ్మెల్సీ చెరుపెల్లి సీతారాములకు వినతి పత్రాన్ని అందజేశారు.
కల్యాణ మండపం నిర్మాణం కోసం ప్రజలు, దాతల సహకారంతో కొనుగోలు చేసిన భూమిని ఇతర అవసరాలకు వినియోగించడం సమంజసం కాదని వారు పేర్కొన్నారు. హిందూ ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక అవసరాలకు ఉపయోగపడేలా ఆ భూమిని సంబంధిత హిందూ ధార్మిక సంస్థలకు కేటాయించాలని కోరారు.
ప్రజల సహకారంతో సమకూర్చిన భూమి ఉద్దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలపై ఉందన్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని భూమిని హిందూ ధార్మిక సంస్థలకు కేటాయించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రజలు కూడా ఈ అంశంలో సహకరించాలని వారు కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి