Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివసాయి వెంచర్‌లో ఓపెన్‌ స్పేస్‌ పరిశీలన.. కబ్జాలకు చెక్‌! తరగతి గదిలో గురువులు.. ఉద్యోగంలో మాత్రం అతిథులే! కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 20, 2026 04:47 PM

రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు యువతే బలం

రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు యువతే బలం

రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు యువతే బలం
20-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్: భారతరత్న, భారత మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను నకిరేకల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించడం ద్వారా దేశ రాజకీయాల్లో యువత భాగస్వామ్యాన్ని పెంచిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని అన్నారు. దేశాన్ని ఆధునిక సాంకేతికత వైపు నడిపించి, ఐటీ విప్లవానికి పునాదులు వేసిన దూరదృష్టి గల నాయకుడని కొనియాడారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి ఆయన చేపట్టిన సంస్కరణలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల భారంలోకి నెడుతోందని, పేపర్ లీకేజీలు, నిరుద్యోగం, మత విద్వేషాలు పెరుగుతున్నాయని ఎమ్మెల్యే విమర్శించారు. యువత, పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం రాహుల్ గాంధీ నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ప్రజా సంక్షేమం, దేశ అభివృద్ధి మరింత వేగంగా సాగుతుందని ఆకాంక్షించారు.

రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా 18 ఏళ్లు నిండిన యువతీ యువకుల ఓటరు నమోదును ఈ సందర్భంగా ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు యువతే బలం

Article Image

నకిరేకల్: భారతరత్న, భారత మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను నకిరేకల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించడం ద్వారా దేశ రాజకీయాల్లో యువత భాగస్వామ్యాన్ని పెంచిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని అన్నారు. దేశాన్ని ఆధునిక సాంకేతికత వైపు నడిపించి, ఐటీ విప్లవానికి పునాదులు వేసిన దూరదృష్టి గల నాయకుడని కొనియాడారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి ఆయన చేపట్టిన సంస్కరణలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల భారంలోకి నెడుతోందని, పేపర్ లీకేజీలు, నిరుద్యోగం, మత విద్వేషాలు పెరుగుతున్నాయని ఎమ్మెల్యే విమర్శించారు. యువత, పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం రాహుల్ గాంధీ నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ప్రజా సంక్షేమం, దేశ అభివృద్ధి మరింత వేగంగా సాగుతుందని ఆకాంక్షించారు.

రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా 18 ఏళ్లు నిండిన యువతీ యువకుల ఓటరు నమోదును ఈ సందర్భంగా ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News