స్కూల్ బస్ డ్రైవర్ల నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బొడ్డుపల్లి లింగస్వామి ఎన్నికయ్యారు. వివిధ పాఠశాలలకు చెందిన బస్ డ్రైవర్లు సమావేశమై నూతన కమిటీని ఏర్పాటు చేశారు.
విద్యార్థుల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని నూతన అధ్యక్షుడు లింగస్వామి తెలిపారు. డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. కమిటీ ఎన్నికతో డ్రైవర్లలో నూతన ఉత్సాహం నెలకొంది.కార్యక్రమంలో కృష్ణవేణి స్కూల్ డ్రైవర్ ఎస్.కె. మహమ్మద్, పల్లవి మోడల్ స్కూల్ స్కూల్ డ్రైవర్ బత్తుల నవీన్, వివేకానంద స్కూల్ డ్రైవర్ తోట వెంకన్న, మదర్ తెరిసా స్కూల్ డ్రైవర్ అవలగంటి వెంకటేశ్, డాన్బాస్కో, కృష్ణవేణి, వివేకానంద, మదర్ తెరిసా తదితర పాఠశాలలకు చెందిన బస్ డ్రైవర్లు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి