విద్యార్థుల భద్రతే ముఖ్యం.
పాఠశాల బస్సుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు.
పాఠశాల బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఎంఈఓ తంగేళ్ల సురేందర్రెడ్డి సూచించారు. బస్సుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా, విద్యార్థులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని అన్నారు.
మండల కేంద్రంలోని మండల వనరుల కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు, హెడ్మాస్టర్లు, బస్సు డ్రైవర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పాఠశాల బస్సులో ఒక టీచర్ లేదా ఆయా తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు.
ఏఎస్ ఐ సురేంద్ర మాట్లాడుతూ ప్రతి పాఠశాల బస్సు ఆర్టీఏ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. డ్రైవర్లు మితిమీరిన వేగంతో బస్సులు నడపకుండా అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థుల భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని సూచించారు.
కార్యక్రమంలో పాఠశాలల కరస్పాండెంట్లు, హెడ్మాస్టర్లు, బస్సు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి