కెరీర్ అవకాశాలపై అవగాహన.
హయత్నగర్ స్థానికం ప్రతినిధి :
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హయత్నగర్ ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు విద్యా విహారయాత్ర నిర్వహించారు. హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)ను బీఏ, బీకాం, బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులు సందర్శించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్బాబు అనుమతి, ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ఐఎస్బీ ఎక్స్టర్నల్ రిలేషన్స్ అసోసియేట్ డైరెక్టర్ శ్రీధర్ భగవతుల విద్యార్థులతో మాట్లాడారు. ఐఎస్బీ విద్యా వాతావరణం, మేనేజ్మెంట్ విద్య ప్రాధాన్యత, ఉన్నత విద్య, భవిష్యత్ కెరీర్ అవకాశాలపై వివరించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్రెడ్డి, వి.ఇందిరా, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. మధు ధర్మపురి, అకడమిక్ కోఆర్డినేటర్ డా. బి.నరసింహ, డా. సంతోషం పాల్గొన్నారు. అలాగే డా. డి.మక్లా, డా. పి.విజయలక్ష్మి, పి.విద్యాసాగర్, డా. వి.కృష్ణమోహన్, డా. జి.ప్రవీణ్కుమార్ విద్యార్థులతో కలిసి పర్యటనలో పాల్గొన్నారు.
ప్రముఖ విద్యాసంస్థను ప్రత్యక్షంగా సందర్శించడం ద్వారా విద్యార్థులకు ఉన్నత విద్య, కెరీర్ అవకాశాలపై అవగాహన పెరిగిందని కళాశాల అధ్యాపకులు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి