Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
"గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయండి, మల్టీ పర్పస్ విధానం రద్దు చేయండి: సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ డిమాండ్, నల్లగొండలో ధర్నా" కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 19, 2026 07:02 PM

ఐఎస్‌బీని సందర్శించిన హయత్‌నగర్‌ డిగ్రీ కళాశాల విద్యార్థులు.

ఐఎస్‌బీని సందర్శించిన హయత్‌నగర్‌ డిగ్రీ కళాశాల విద్యార్థులు.

ఐఎస్‌బీని సందర్శించిన హయత్‌నగర్‌ డిగ్రీ కళాశాల విద్యార్థులు.
19-08-2026 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కెరీర్‌ అవకాశాలపై అవగాహన.

హయత్‌నగర్‌ స్థానికం ప్రతినిధి :

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హయత్‌నగర్‌ ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు విద్యా విహారయాత్ర నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)ను బీఏ, బీకాం, బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులు సందర్శించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డా. పి. సురేష్‌బాబు అనుమతి, ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ఐఎస్‌బీ ఎక్స్‌టర్నల్‌ రిలేషన్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ భగవతుల విద్యార్థులతో మాట్లాడారు. ఐఎస్‌బీ విద్యా వాతావరణం, మేనేజ్‌మెంట్‌ విద్య ప్రాధాన్యత, ఉన్నత విద్య, భవిష్యత్‌ కెరీర్‌ అవకాశాలపై వివరించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌రెడ్డి, వి.ఇందిరా, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డా. మధు ధర్మపురి, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ డా. బి.నరసింహ, డా. సంతోషం పాల్గొన్నారు. అలాగే డా. డి.మక్లా, డా. పి.విజయలక్ష్మి, పి.విద్యాసాగర్‌, డా. వి.కృష్ణమోహన్‌, డా. జి.ప్రవీణ్‌కుమార్‌ విద్యార్థులతో కలిసి పర్యటనలో పాల్గొన్నారు.

ప్రముఖ విద్యాసంస్థను ప్రత్యక్షంగా సందర్శించడం ద్వారా విద్యార్థులకు ఉన్నత విద్య, కెరీర్‌ అవకాశాలపై అవగాహన పెరిగిందని కళాశాల అధ్యాపకులు తెలిపారు.

Sthanikam

ఐఎస్‌బీని సందర్శించిన హయత్‌నగర్‌ డిగ్రీ కళాశాల విద్యార్థులు.

Article Image

కెరీర్‌ అవకాశాలపై అవగాహన.

హయత్‌నగర్‌ స్థానికం ప్రతినిధి :

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హయత్‌నగర్‌ ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు విద్యా విహారయాత్ర నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)ను బీఏ, బీకాం, బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులు సందర్శించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డా. పి. సురేష్‌బాబు అనుమతి, ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ఐఎస్‌బీ ఎక్స్‌టర్నల్‌ రిలేషన్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ భగవతుల విద్యార్థులతో మాట్లాడారు. ఐఎస్‌బీ విద్యా వాతావరణం, మేనేజ్‌మెంట్‌ విద్య ప్రాధాన్యత, ఉన్నత విద్య, భవిష్యత్‌ కెరీర్‌ అవకాశాలపై వివరించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌రెడ్డి, వి.ఇందిరా, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డా. మధు ధర్మపురి, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ డా. బి.నరసింహ, డా. సంతోషం పాల్గొన్నారు. అలాగే డా. డి.మక్లా, డా. పి.విజయలక్ష్మి, పి.విద్యాసాగర్‌, డా. వి.కృష్ణమోహన్‌, డా. జి.ప్రవీణ్‌కుమార్‌ విద్యార్థులతో కలిసి పర్యటనలో పాల్గొన్నారు.

ప్రముఖ విద్యాసంస్థను ప్రత్యక్షంగా సందర్శించడం ద్వారా విద్యార్థులకు ఉన్నత విద్య, కెరీర్‌ అవకాశాలపై అవగాహన పెరిగిందని కళాశాల అధ్యాపకులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News