Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జ్ఞాపకాలను సజీవంగా నిలిపే అద్భుత కళ ఫొటోగ్రఫీ కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 19, 2026 08:01 PM

ఫుట్‌పాత్ చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాలి: సీపీఎం

ఫుట్‌పాత్ చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాలి: సీపీఎం

ఫుట్‌పాత్ చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాలి: సీపీఎం
19-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

నగర అభివృద్ధి పేరుతో ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేదల ఉపాధిని దెబ్బతీయొద్దని సీపీఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, మాజీ కౌన్సిలర్ అవుట రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిరు వ్యాపారులను తొలగించే ముందు వారికి ప్రత్యామ్నాయ స్థలాలు, దుకాణ సముదాయాలు ఏర్పాటు చేసి వారి జీవనోపాధికి భరోసా కల్పించాలని కోరారు.

బుధవారం నల్గొండలోని సీపీఎం పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు, పెదగడియారం నుంచి స్టేడియం వరకు, దేవరకొండ రోడ్డు తదితర ప్రధాన ప్రాంతాల్లో వందలాది కుటుంబాలు ఫుట్‌పాత్‌లపై చిన్నచిన్న వ్యాపారాలు నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నాయని తెలిపారు. పండ్లు, కూరగాయలు, చిరుతిళ్లు, ఇతర వస్తువులు విక్రయిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న చిరు వ్యాపారులే తమకు ఆధారమని పేర్కొన్నారు.

అయితే నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలనే పేరుతో అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా చిరు వ్యాపారులపై ఆకస్మికంగా దాడులు చేయడం, వారి సరుకులను చిందరవందర చేయడం, వ్యాపార సామగ్రిని తొలగించడం సరికాదన్నారు. ఇలాంటి చర్యలతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలు మరింత నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చర్యల కారణంగా వ్యాపారులు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు.

అభివృద్ధి అంటే కేవలం రోడ్లను వెడల్పు చేయడం, ప్రధాన రహదారులను అందంగా తీర్చిదిద్దడం మాత్రమే కాదని సీపీఎం నాయకులు అన్నారు. నగర అభివృద్ధిలో పేదలు, చిరు వ్యాపారులు, కార్మికుల జీవనోపాధికి రక్షణ కల్పించడం కూడా ముఖ్యమైన అంశమని స్పష్టం చేశారు. ఉపాధి అవకాశాలను పెంచుతూ ప్రజలకు మెరుగైన జీవన పరిస్థితులు కల్పించడమే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు.

ప్రధాన రహదారులను మాత్రమే అభివృద్ధి చేసి నగరం మొత్తం అభివృద్ధి చెందిందని భావించడం సరైనది కాదన్నారు. పట్టణంలోని అనేక అంతర్గత రోడ్లు, కాలనీల్లో కనీస సౌకర్యాలు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని తెలిపారు. పలు కాలనీల నుంచి వార్డు కార్యాలయాలకు వెళ్లేందుకు కూడా సరైన లింకు రోడ్లు లేని పరిస్థితి ఉందని గుర్తు చేశారు.

ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా చిరు వ్యాపారుల సమస్యపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని వారు కోరారు. వ్యాపారులను బలవంతంగా తొలగించే చర్యలను నిలిపివేసి, పట్టణంలో అనువైన ప్రాంతాలను గుర్తించి వారికి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అవసరమైన చోట దుకాణ సముదాయాలను నిర్మించి, తక్కువ అద్దెకు లేదా అనుకూల నిబంధనలతో చిరు వ్యాపారులకు అందించాలని సూచించారు.

నగర సుందరీకరణ, ట్రాఫిక్ నియంత్రణ చర్యలకు సీపీఎం వ్యతిరేకం కాదని, అయితే ఆ పేరుతో పేదల పొట్టకొట్టే చర్యలను మాత్రం సహించబోమని సత్తయ్య, రవీందర్ స్పష్టం చేశారు. వ్యాపారులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. చిరు వ్యాపారుల జీవనోపాధిని కాపాడుతూ నల్గొండ నగరాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

Sthanikam

ఫుట్‌పాత్ చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాలి: సీపీఎం

Article Image

నగర అభివృద్ధి పేరుతో ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేదల ఉపాధిని దెబ్బతీయొద్దని సీపీఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, మాజీ కౌన్సిలర్ అవుట రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిరు వ్యాపారులను తొలగించే ముందు వారికి ప్రత్యామ్నాయ స్థలాలు, దుకాణ సముదాయాలు ఏర్పాటు చేసి వారి జీవనోపాధికి భరోసా కల్పించాలని కోరారు.

బుధవారం నల్గొండలోని సీపీఎం పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు, పెదగడియారం నుంచి స్టేడియం వరకు, దేవరకొండ రోడ్డు తదితర ప్రధాన ప్రాంతాల్లో వందలాది కుటుంబాలు ఫుట్‌పాత్‌లపై చిన్నచిన్న వ్యాపారాలు నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నాయని తెలిపారు. పండ్లు, కూరగాయలు, చిరుతిళ్లు, ఇతర వస్తువులు విక్రయిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న చిరు వ్యాపారులే తమకు ఆధారమని పేర్కొన్నారు.

అయితే నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలనే పేరుతో అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా చిరు వ్యాపారులపై ఆకస్మికంగా దాడులు చేయడం, వారి సరుకులను చిందరవందర చేయడం, వ్యాపార సామగ్రిని తొలగించడం సరికాదన్నారు. ఇలాంటి చర్యలతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలు మరింత నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చర్యల కారణంగా వ్యాపారులు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు.

అభివృద్ధి అంటే కేవలం రోడ్లను వెడల్పు చేయడం, ప్రధాన రహదారులను అందంగా తీర్చిదిద్దడం మాత్రమే కాదని సీపీఎం నాయకులు అన్నారు. నగర అభివృద్ధిలో పేదలు, చిరు వ్యాపారులు, కార్మికుల జీవనోపాధికి రక్షణ కల్పించడం కూడా ముఖ్యమైన అంశమని స్పష్టం చేశారు. ఉపాధి అవకాశాలను పెంచుతూ ప్రజలకు మెరుగైన జీవన పరిస్థితులు కల్పించడమే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు.

ప్రధాన రహదారులను మాత్రమే అభివృద్ధి చేసి నగరం మొత్తం అభివృద్ధి చెందిందని భావించడం సరైనది కాదన్నారు. పట్టణంలోని అనేక అంతర్గత రోడ్లు, కాలనీల్లో కనీస సౌకర్యాలు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని తెలిపారు. పలు కాలనీల నుంచి వార్డు కార్యాలయాలకు వెళ్లేందుకు కూడా సరైన లింకు రోడ్లు లేని పరిస్థితి ఉందని గుర్తు చేశారు.

ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా చిరు వ్యాపారుల సమస్యపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని వారు కోరారు. వ్యాపారులను బలవంతంగా తొలగించే చర్యలను నిలిపివేసి, పట్టణంలో అనువైన ప్రాంతాలను గుర్తించి వారికి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అవసరమైన చోట దుకాణ సముదాయాలను నిర్మించి, తక్కువ అద్దెకు లేదా అనుకూల నిబంధనలతో చిరు వ్యాపారులకు అందించాలని సూచించారు.

నగర సుందరీకరణ, ట్రాఫిక్ నియంత్రణ చర్యలకు సీపీఎం వ్యతిరేకం కాదని, అయితే ఆ పేరుతో పేదల పొట్టకొట్టే చర్యలను మాత్రం సహించబోమని సత్తయ్య, రవీందర్ స్పష్టం చేశారు. వ్యాపారులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. చిరు వ్యాపారుల జీవనోపాధిని కాపాడుతూ నల్గొండ నగరాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News