రామన్నపేట,
ఒక్క క్లిక్తో ఓ సంఘటనను చరిత్రలో పదిలం చేసే ఫోటోగ్రఫీకి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపేట మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ మండల అధ్యక్షుడు మెడబోయిన ఉపేందర్ జెండాను ఆవిష్కరించారు. ఫోటోగ్రఫీ, వీడియో గ్రాఫీ రంగాల్లో పనిచేస్తున్న వారిని అభినందించారు. సమాజంలో జరిగే ప్రతి ముఖ్య ఘటనను కెమెరా కంటితో ప్రజలకు అందిస్తూ, వాటిని భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత ఫోటోగ్రాఫర్లపై ఉందన్నారు.
కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి భాషా మల్ల సంతోష్కుమార్, కార్యదర్శి కమల్శెట్టి శ్రీకాంత్, గౌరవ సలహాదారులు నాగటి యాదయ్య, మొగిలి రమేష్, వెంకటరమణ, నకిరేకంటి రవి, నకిరేకంటి శీను, రుద్ర చంద్రశేఖర్, మహేందర్, భార్గవ్, ఆది తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి