ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఒకే గదిలో.. వేములవాడలో అర్ధరాత్రి హైడ్రామా.
వేములవాడ: ఫోక్ సాంగ్స్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ పేర్లు ప్రస్తుతం వివాదంలో వినిపిస్తున్నాయి. వేములవాడలోని ఓ భవనంలో అర్ధరాత్రి సమయంలో వీరిద్దరూ ఒకే గదిలో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య అక్కడికి చేరుకుని వారిని నిలదీసినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన భర్తతో మాధురి రాథోడ్ సన్నిహితంగా ఉంటున్నారంటూ ఈశ్వర్ సాయి భార్య ఆరోపించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా సమాచారం. అనంతరం ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, వీడియోలో కనిపించిన పరిస్థితుల ఆధారంగా వారి మధ్య వ్యక్తిగత సంబంధాన్ని నిర్ధారించలేమని పలు కథనాలు పేర్కొన్నాయి.ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘ప్రమీల’ ఫోక్ సాంగ్లో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ కలిసి నటించారు. వీరిద్దరూ గతంలోనూ పలు ఫోక్ సాంగ్స్లో జోడీగా కనిపించారు. ‘రాతిరి రాతిరి రాతిరిలో’ వంటి పాటలతోనూ గుర్తింపు పొందారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఫోక్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. పోలీసుల దర్యాప్తు, ఇరువర్గాల వాదనలు వెలుగులోకి వస్తేనే ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి