ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జి బిర్రు మహేందర్ మాదిగ
అసమానతలు లేని సమాజ స్థాపనే లక్ష్యంగా ఉద్యమిస్తున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు సెప్టెంబర్ 9న జరిగే 'చలో వరంగల్' ఎమ్మార్పీఎస్ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని ఆ సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జి బిర్రు మహేందర్ మాదిగ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ భవన్లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ మండల ఇన్ఛార్జి బోయ లింగస్వామి మాదిగ అధ్యక్షతన బుధవారం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మహేందర్ మాదిగ మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలని సూచించారు. మాదిగ జాతి ఆత్మగౌరవం, హక్కుల పోరాటంలో భాగంగా 33 ఏళ్లుగా శ్రమిస్తున్న మందకృష్ణ మాదిగకు మద్దతుగా చౌటుప్పల్ నుంచి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. సమావేశంలో చౌటుప్పల్ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుని నియామక పత్రాలను అందజేశారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు చీమకండ్ల శ్రీనివాస్ మాదిగ, అధికార ప్రతినిధి బోయ నిరంజన్ మాదిగ, టౌన్ అధ్యక్షుడు దోనకొండ కిరణ్ మాదిగ,
టౌన్ అధికార ప్రతినిధి ఉపేందర్ మాదిగ, ఎంఎస్పీ మండల అధ్యక్షుడు ముత్యాల గణేష్ మాదిగ, నూతనంగా ఎన్నికైన నాయకులను అభినందించిన బిర్రు మహేందర్, మండల వ్యాప్తంగా ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బోయ రామచందర్, ఊదరి నరసింహ, ఊదరి వెంకటేశ్ మహాజన్, కట్టెల లింగస్వామి, ఊదరి శ్యామ్సుందర్, ఆరుట్ల లింగస్వామి, బోదుల లింగస్వామి, సుక్క కృష్ణ, ఎర్ర శంకర్, కుంటి గణేశ్, ఊదరి రమేశ్, దళిత రత్న అవార్డు గ్రహీత ఊదరి నరసింహ, బోయ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి