సూర్యాపేట పట్టణంలోని 15వ వార్డు బాలాజీనగర్లో డ్రైనేజీ నీరు రోడ్డుపైకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను వార్డు ప్రజలు కౌన్సిలర్ పిల్లల భవాని రమేష్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే స్పందించిన కౌన్సిలర్ డ్రైనేజీ నీరు రోడ్డుపై నిల్వ ఉండకుండా పైపులు ఏర్పాటు చేయించారు. అనంతరం జేసీబీని తీసుకువచ్చి రోడ్డుపై పేరుకుపోయిన బురదమట్టిని తొలగించే పనులు చేపట్టారు. అలాగే ఖాళీ ప్లాట్లలో పెరిగిన చెట్లను తొలగిస్తూ పారిశుధ్య పనులను పర్యవేక్షించారు.
డ్రైనేజీ సమస్యకు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టడంపై స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి