Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
"గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయండి, మల్టీ పర్పస్ విధానం రద్దు చేయండి: సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ డిమాండ్, నల్లగొండలో ధర్నా" కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 19, 2026 07:10 PM

ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అర్హులకే మంజూరు చేయాలి

ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అర్హులకే మంజూరు చేయాలి

ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అర్హులకే మంజూరు చేయాలి
19-08-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసే రుణాలను రాజకీయ జోక్యం లేకుండా నిజమైన అర్హులైన లబ్ధిదారులకే అందించాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొటారి నర్సింలు డిమాండ్ చేశారు. పేద, నిరుద్యోగ ఎస్సీ కుటుంబాలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, సిఫారసులతో అర్హత లేని వారికి మంజూరు చేయడం వల్ల నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. అధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సమాన అవకాశం కల్పించాలని కోరారు. రాజకీయ జోక్యంతో అర్హత లేని వారికి రుణాలు మంజూరు చేస్తే కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని, అవసరమైతే మండల అభివృద్ధి కార్యాలయాలు, ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాలను ముట్టడిస్తామని నర్సింలు హెచ్చరించారు. వెంటనే అర్హులైన లబ్ధిదారులను గుర్తించి రుణాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకులు ఎస్. గణపతి, తుకారాం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అర్హులకే మంజూరు చేయాలి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసే రుణాలను రాజకీయ జోక్యం లేకుండా నిజమైన అర్హులైన లబ్ధిదారులకే అందించాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొటారి నర్సింలు డిమాండ్ చేశారు. పేద, నిరుద్యోగ ఎస్సీ కుటుంబాలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, సిఫారసులతో అర్హత లేని వారికి మంజూరు చేయడం వల్ల నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. అధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సమాన అవకాశం కల్పించాలని కోరారు. రాజకీయ జోక్యంతో అర్హత లేని వారికి రుణాలు మంజూరు చేస్తే కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని, అవసరమైతే మండల అభివృద్ధి కార్యాలయాలు, ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాలను ముట్టడిస్తామని నర్సింలు హెచ్చరించారు. వెంటనే అర్హులైన లబ్ధిదారులను గుర్తించి రుణాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకులు ఎస్. గణపతి, తుకారాం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News