: సైబర్ నేరగాళ్ల మాయలో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మల్కాజిగిరి సైబర్ క్రైమ్ డీసీపీ నాగలక్ష్మి సూచించారు. సైబర్ జాగరూకత దివస్ సందర్భంగా నాగోల్ పోలీస్ స్టేషన్లో సుమారు 60 మంది సీనియర్ సిటిజన్లకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిజిటల్ అరెస్ట్ మోసాలు, పెట్టుబడుల పేరుతో మోసాలు, పార్ట్టైమ్ ఉద్యోగాల పేరుతో మోసాలు, ఓఎల్ఎక్స్, ఆన్లైన్ షాపింగ్, కస్టమర్ కేర్, రుణాలు, మ్యాట్రిమోనియల్ మోసాలు తదితర సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. టిజైన్ కేసులు, ఆన్లైన్ భద్రత, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓటీపీ–యూపీఐ మోసాలు, ఫిషింగ్ వంటి అంశాలను వివరించారు.
ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, యూపీఐ పిన్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వ్యక్తులకు వెల్లడించవద్దని పోలీసులు సూచించారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా, ఆన్లైన్ లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
కార్యక్రమంలో ఏసీపీ శివశంకర్ గౌడ్, నాగోల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ, ఎస్ఐలు పి.శివ నాగ ప్రసాద్, మమతారెడ్డి పాల్గొన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి