నల్లగొండ ఎస్ఈ కార్యాలయం ముట్టడి.. రైతులతో కలిసి నిరసనకు దిగిన చిరుమర్తి లింగయ్య.
నల్లగొండ: రైతులను వేధిస్తున్న లో వోల్టేజీ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు గురువారం నల్లగొండ విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయాన్ని ముట్టడించాయి. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా రైతులతో కలిసి చిరుమర్తి లింగయ్య కాలిపోయిన బోరు మోటర్లు, ఎండిపోయిన వరి పంటలను ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. లో వోల్టేజీ కారణంగా మోటర్లు కాలిపోవడంతోపాటు పంటలకు సక్రమంగా నీరందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.లో వోల్టేజీ సమస్యతో ఎండిపోయిన రైతుల పంటలకు ప్రభుత్వమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు కోతలు లేని 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, విద్యుత్ సమస్యల కారణంగా రైతులు నష్టపోకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.రైతుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి