హైదరాబాద్: శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని ఆగస్టు 21న శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. అష్టలక్ష్ముల్లో ఒకరైన వరలక్ష్మీదేవిని పూజించడం వల్ల సిరిసంపదలు, సుఖసంతోషాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
స్థిర లగ్నంలో వరలక్ష్మీదేవిని పూజించడం శ్రేయస్కరమని పేర్కొంటున్నారు. ముఖ్యంగా సింహ, వృశ్చిక, కుంభ, వృషభ లగ్న సమయాలు పూజకు అనుకూలంగా ఉంటాయని తెలిపారు.
పూజా సమయాలు ఇలా..
ఉదయం: 6:10 నుంచి 8:28 గంటల వరకు సింహ లగ్నం
మధ్యాహ్నం: 12:40 నుంచి 2:58 గంటల వరకు వృశ్చిక లగ్నం
సాయంత్రం: 6:20 నుంచి 7:58 గంటల వరకు కుంభ లగ్నం
ఈ శుభముహూర్తాల్లో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి, వ్రతం ఆచరించవచ్చని పండితులు సూచిస్తున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి