Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివసాయి వెంచర్‌లో ఓపెన్‌ స్పేస్‌ పరిశీలన.. కబ్జాలకు చెక్‌! తరగతి గదిలో గురువులు.. ఉద్యోగంలో మాత్రం అతిథులే! కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 20, 2026 04:48 PM

స్వర్గీయ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివి;కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేగటి రవి

స్వర్గీయ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివి;కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేగటి రవి

స్వర్గీయ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివి;కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేగటి రవి
20-08-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రములో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా తుంగతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేగటి రవి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి, రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను, సంస్కరణ లను కొనియాడారు.

ఈ సందర్భంగా

మండల అధ్యక్షుడు రేగటి రవి మాట్లాడుతూ

యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించడం ద్వారా యువతను ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములను చేశారు. భారతదేశంలో కంప్యూటర్, టెలికమ్యూనికేషన్ మరియు సాంకేతిక రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి, దేశాన్ని ఆధునిక సాంకేతిక యుగం వైపు నడిపించారని ఆన్నారు.డిజిటల్ , టెలికాం విప్లవానికి పునాది వేసి, భవిష్యత్ భారతదేశానికి సాంకేతిక అభివృద్ధి దిశను చూపించారని తెలిపారు.

విద్య, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి ప్రోత్సాహం అందించి, ఆధునిక భారత నిర్మాణంలో యువత పాత్రను బలపరిచారని అన్నారు.

పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేసి, గ్రామీణ ప్రజలకు స్థానిక పాలనలో మరింత భాగస్వామ్యం కల్పించాలనే ఆలోచనకు బలమైన పునాది వేశారు అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో

మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, NSUI మరియు ఇతర అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

స్వర్గీయ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివి;కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేగటి రవి

Article Image

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రములో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా తుంగతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేగటి రవి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి, రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను, సంస్కరణ లను కొనియాడారు.

ఈ సందర్భంగా

మండల అధ్యక్షుడు రేగటి రవి మాట్లాడుతూ

యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించడం ద్వారా యువతను ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములను చేశారు. భారతదేశంలో కంప్యూటర్, టెలికమ్యూనికేషన్ మరియు సాంకేతిక రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి, దేశాన్ని ఆధునిక సాంకేతిక యుగం వైపు నడిపించారని ఆన్నారు.డిజిటల్ , టెలికాం విప్లవానికి పునాది వేసి, భవిష్యత్ భారతదేశానికి సాంకేతిక అభివృద్ధి దిశను చూపించారని తెలిపారు.

విద్య, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి ప్రోత్సాహం అందించి, ఆధునిక భారత నిర్మాణంలో యువత పాత్రను బలపరిచారని అన్నారు.

పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేసి, గ్రామీణ ప్రజలకు స్థానిక పాలనలో మరింత భాగస్వామ్యం కల్పించాలనే ఆలోచనకు బలమైన పునాది వేశారు అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో

మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, NSUI మరియు ఇతర అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News