సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రములో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా తుంగతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేగటి రవి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి, రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను, సంస్కరణ లను కొనియాడారు.
ఈ సందర్భంగా
మండల అధ్యక్షుడు రేగటి రవి మాట్లాడుతూ
యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించడం ద్వారా యువతను ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములను చేశారు. భారతదేశంలో కంప్యూటర్, టెలికమ్యూనికేషన్ మరియు సాంకేతిక రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి, దేశాన్ని ఆధునిక సాంకేతిక యుగం వైపు నడిపించారని ఆన్నారు.డిజిటల్ , టెలికాం విప్లవానికి పునాది వేసి, భవిష్యత్ భారతదేశానికి సాంకేతిక అభివృద్ధి దిశను చూపించారని తెలిపారు.
విద్య, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి ప్రోత్సాహం అందించి, ఆధునిక భారత నిర్మాణంలో యువత పాత్రను బలపరిచారని అన్నారు.
పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేసి, గ్రామీణ ప్రజలకు స్థానిక పాలనలో మరింత భాగస్వామ్యం కల్పించాలనే ఆలోచనకు బలమైన పునాది వేశారు అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో
మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, NSUI మరియు ఇతర అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి