Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివసాయి వెంచర్‌లో ఓపెన్‌ స్పేస్‌ పరిశీలన.. కబ్జాలకు చెక్‌! తరగతి గదిలో గురువులు.. ఉద్యోగంలో మాత్రం అతిథులే! కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 20, 2026 05:28 PM

పాలిటెక్నిక్‌ విద్యార్థుల రాస్తారోకో.అబ్దుల్లాపూర్‌మెట్‌ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. పలువురికి గాయాలు

పాలిటెక్నిక్‌ విద్యార్థుల రాస్తారోకో.అబ్దుల్లాపూర్‌మెట్‌ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. పలువురికి గాయాలు

పాలిటెక్నిక్‌ విద్యార్థుల రాస్తారోకో.అబ్దుల్లాపూర్‌మెట్‌ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. పలువురికి గాయాలు
20-08-2026 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అబ్దుల్లాపూర్‌మెట్‌: జీవో నంబర్‌ 97ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పాలిటెక్నిక్‌ విద్యార్థులు అబ్దుల్లాపూర్‌మెట్‌ జాతీయ రహదారిపై భారీగా రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థుల ఆందోళనతో హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

ఆందోళనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో విద్యార్థులు, పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేయగా పలువురు విద్యార్థులకు గాయాలైనట్లు సమాచారం. ఆందోళనలో పాల్గొన్న కొంతమంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే జీవో నంబర్‌ 97ను రద్దు చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఎస్ఎఫ్‌ఏ నాయకులు గుండే శివకుమార్, శశితో పాటు విద్యార్థులు పునీత్, గౌస్, జస్వంత్ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.

Sthanikam

పాలిటెక్నిక్‌ విద్యార్థుల రాస్తారోకో.అబ్దుల్లాపూర్‌మెట్‌ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. పలువురికి గాయాలు

Article Image

అబ్దుల్లాపూర్‌మెట్‌: జీవో నంబర్‌ 97ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పాలిటెక్నిక్‌ విద్యార్థులు అబ్దుల్లాపూర్‌మెట్‌ జాతీయ రహదారిపై భారీగా రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థుల ఆందోళనతో హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

ఆందోళనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో విద్యార్థులు, పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేయగా పలువురు విద్యార్థులకు గాయాలైనట్లు సమాచారం. ఆందోళనలో పాల్గొన్న కొంతమంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే జీవో నంబర్‌ 97ను రద్దు చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఎస్ఎఫ్‌ఏ నాయకులు గుండే శివకుమార్, శశితో పాటు విద్యార్థులు పునీత్, గౌస్, జస్వంత్ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News