అబ్దుల్లాపూర్మెట్: జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు అబ్దుల్లాపూర్మెట్ జాతీయ రహదారిపై భారీగా రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థుల ఆందోళనతో హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఆందోళనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో విద్యార్థులు, పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేయగా పలువురు విద్యార్థులకు గాయాలైనట్లు సమాచారం. ఆందోళనలో పాల్గొన్న కొంతమంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే జీవో నంబర్ 97ను రద్దు చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఎస్ఎఫ్ఏ నాయకులు గుండే శివకుమార్, శశితో పాటు విద్యార్థులు పునీత్, గౌస్, జస్వంత్ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి