Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివసాయి వెంచర్‌లో ఓపెన్‌ స్పేస్‌ పరిశీలన.. కబ్జాలకు చెక్‌! తరగతి గదిలో గురువులు.. ఉద్యోగంలో మాత్రం అతిథులే! కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 20, 2026 06:11 PM

ప్రీ ప్రైమరీ సిబ్బంది నియామక ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలి..

ప్రీ ప్రైమరీ సిబ్బంది నియామక ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలి..

ప్రీ ప్రైమరీ సిబ్బంది నియామక ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలి..
20-08-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav


పట్టించుకోని విద్యాశాఖ నేడు డీఈఓ కార్యాలయం ఎదుట TSUTF నిరసన..

నల్లగొండ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణ కోసం ఎంపిక చేసిన సిబ్బందికి వెంటనే నియామక ఉత్తర్వులు అందజేయాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) నల్లగొండ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసాచారి, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఎంపిక చేసిన 124 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించేందుకు విద్యాశాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసి, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. అనంతరం మెరిట్ జాబితాను సైతం విడుదల చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయకపోవడం శోచనీయమన్నారు.

రెండు నెలలైనా స్పందన ఏదీ?

పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులు, ఆయాల నియామకాలు పూర్తి చేయకపోవడంతో ఆయా పాఠశాలల్లో చిన్న పిల్లల బోధన, నిర్వహణ తీవ్రంగా ప్రభావితమవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ శుక్రవారం (ఆగస్టు 21) ఉదయం 11 గంటలకు నల్లగొండ జిల్లా విద్యాశాఖాధికారి (DEO) కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభమైన పాఠశాలల ఉపాధ్యాయులు, మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులు మరియు TSUTF బాధ్యులు, సభ్యులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.


Sthanikam

ప్రీ ప్రైమరీ సిబ్బంది నియామక ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలి..

Article Image


పట్టించుకోని విద్యాశాఖ నేడు డీఈఓ కార్యాలయం ఎదుట TSUTF నిరసన..

నల్లగొండ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణ కోసం ఎంపిక చేసిన సిబ్బందికి వెంటనే నియామక ఉత్తర్వులు అందజేయాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) నల్లగొండ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసాచారి, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఎంపిక చేసిన 124 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించేందుకు విద్యాశాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసి, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. అనంతరం మెరిట్ జాబితాను సైతం విడుదల చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయకపోవడం శోచనీయమన్నారు.

రెండు నెలలైనా స్పందన ఏదీ?

పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులు, ఆయాల నియామకాలు పూర్తి చేయకపోవడంతో ఆయా పాఠశాలల్లో చిన్న పిల్లల బోధన, నిర్వహణ తీవ్రంగా ప్రభావితమవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ శుక్రవారం (ఆగస్టు 21) ఉదయం 11 గంటలకు నల్లగొండ జిల్లా విద్యాశాఖాధికారి (DEO) కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభమైన పాఠశాలల ఉపాధ్యాయులు, మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులు మరియు TSUTF బాధ్యులు, సభ్యులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News