పాలకవర్గ సాధారణ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం
చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపడుతున్నందున, మార్కెట్ యార్డ్ కోసం కనీసం 10 ఎకరాల అనువైన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య అధ్యక్షతన పాలకవర్గ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే నూతన మార్కెట్ యార్డ్ నిర్మాణం అత్యంత అవసరమని పేర్కొన్నారు. కనీసం 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని వెంటనే మార్కెట్ యార్డ్కు కేటాయించాలని తీర్మానం ప్రవేశపెట్టగా, పాలకవర్గ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, వెలిమినేడు పిఎసీఎస్ చైర్మన్ రఘుమారెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాని, మార్కెట్ కమిటీ కార్యదర్శి రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బోయ వెంకటేష్, కరంటోతు శంకర్ నాయక్, డిల్లి చంద్రకళ, మహమ్మద్ గౌస్ ఖాన్, చిమ్మల వెంకట్ రెడ్డి, పబ్బు శ్రీకాంత్ గౌడ్, మర్రి రాజి రెడ్డి, సుర్వి వెంకటేష్ గౌడ్, దాచేపల్లి విజయ్ కుమార్, గజ్జెల కృష్ణ మూర్తి, మార్కెట్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి